సామాన్యుడి జేబుకు మరింత చిల్లు… జనవరి నుంచి పెరగనున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.వెయ్యి లోపు ఉండే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే గార్మెంట్స్పై ఇప్పటివరకు అమలు చేస్తున్న ఐదు శాతం జీఎస్టీ జనవరి నుంచి 12 శాతానికి పెరగనుంది. దీంతో వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. సాధారణంగా గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ.వెయ్యి లోపు విలువ ఉండేవే ఉంటాయి. ఈ నెల 18న రూ.వెయ్యి విలువ గల గార్మెంట్స్ మీద జీఎస్టీ శ్లాబ్ను 12 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: వైరల్ వీడియో… చంద్రబాబు ఏడ్చాడని తానూ ఏడ్చిన చిన్నారి
Also Read
ఈ మేరకు రూ.వెయ్యి విలువ లోపు గార్మెంట్స్ మీద కూడా 12 శాతం జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తుందని ఐసీసీ టెక్స్టైల్ కమిటీ ఛైర్మన్ సంజయ్ కే జైన్ తెలిపారు. పేదవారు కూడా ఇక నుంచి తమ దుస్తులపై 7 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నారు. ఇప్పటికే నూలు ధర 25 శాతం పెరిగిందని….ఇప్పుడు జీఎస్టీ కూడా పెంచడంతో నూలుపై వచ్చే ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తమకు సాయపడదని సంజయ్ కే జైన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా గార్మెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు ఉంటే, జీఎస్టీ భారం రూ.8.5 లక్షల కోట్లపై పడుతుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!