కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చిన క్రికెట్ ప్రేక్షకులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్ లు కొనసాగుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని కొత్త సెంటిమెంట్ లు వస్తాయి. తాజాగా నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయిన తర్వాత ఓ కొత్త సెంటిమెంట్ ను అభిమానులు తెరపైకి తెచ్చారు. అయితే ఐసీసీ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్ల కెప్టెన్ లు ట్రోఫీని పట్టుకొని ఫోటో దిగుతారు. అయితే ఆ ఫోటో సమయంలో ట్రోఫీకి ఎడమ వైపు ఏ కెప్టెన్ నిలుచుంటే ఆ జట్టు ఓడిపోతుంది అని అంటున్నారు అభిమానులు. దానికి ఉదాహరణగా 2016 ప్రపంచ కప్ నుండి నిన్న ముగిసిన ప్రపంచ కప్ ఫోటోల వరకు షేర్ చేస్తున్నారు. అయితే 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు మోర్గాన్ ఉండటంతో ఆ జట్టు ఓడిపోయిందని.. అలాగే 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ట్రోఫీకి ఎడమ ఉన్న కోహ్లీ జట్టు… 2019 ప్రపంచ కప్ లో ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కేన్ విలియమ్సన్ జట్టు… 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ట్రోఫీకి ఎడమ వైపు ఉన్న కోహ్లీ జట్టు.. ఇక తాజాగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో మళ్ళీ ట్రోఫీకి ఎడమ వైపు కేన్ విలియమ్సన్ జట్టు ఓడిపోయింది అంటున్నారు అభిమానులు. మరి ఈ సెంటిమెంట్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది చూడాలి.
Also Read
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
తాజావార్తలు
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..