ఉలిక్కిపడ్డ దేశ రాజధాని… ఢిల్లీ కోర్టులో పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండే కోర్టులో పేలుడు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారి పేలుడు చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విశ్లేషించారు. ఓ గదిలో ఉన్న బ్యాగులోని ల్యాప్టాప్ పేలిందని.. ల్యాప్టాప్లోని బ్యాటరీలే పేలుడుకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించామన్నారు.
Read Also: కోహ్లీకి వన్డే కెప్టెన్సీ పోవడానికి ఆ 48 గంటలే కారణమా?
Also Read
కాగా ఉదయం 10:30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని.. భారీగా శబ్ధం వినిపించడంతో అందరూ బాంబు అని భయపడిపోయారని అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలు అన్నీ నిలిపివేశామన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్ఎస్జీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ల్యాప్టాప్ పేలిందని తెలుసుకున్న స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ల్యాప్టాప్ పేలి నేలపై పడిఉన్న వీడియోలు, ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి.
తాజావార్తలు
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!