పీఆర్సీపై సర్కార్కు డెడ్లైన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కాస్త గ్యాప్ పెరుగుతోంది.. జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాయి.. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తాం.. ఆ తరువాత సీఎస్ ను కలిసి మా భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తాం అన్నారు.. మేం దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదని.. పీఆర్సీ నివేదిక పై సీఎస్ హామీకే విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. అధికారంలోకి వస్తే.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు బండి శ్రీనివాసరావు.. జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు రావడంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది. ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసరం లేదా? అని ప్రశ్నించిన ఆయన.. పీఆర్సీ నివేదిక శుక్రవారం ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదని.. మాకు రావాల్సిన బకాయిలు మార్చి నాటికి క్లియర్ చేస్తామని చెప్పారు.. అందుకే నిన్నటి సమావేశం బాయ్ కాట్ చేశామని వెల్లడించారు.. మా రెండు జేఏసీల ఆధ్వర్యంలో 200 సంఘాలున్నాయి. మా సంఘాలన్నీ క్రింది స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
Also Read
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చాకా ఒక్క డీఏ కూడా రాలేదు అని విమర్శించారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు.. పీఆర్సీ నివేదిక కూడా మాకు ఇవ్వలేదు.. మేం అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు అన్నారు.. ఇప్పటికీ సీపీఎస్ రద్దు కాలేదు.. కమిటీలు కాలయాపనకే గానీ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాదు అని ఆరోపించారు.. పీఆర్సీ నివేదికపై అధికారుల కమిటీ పరిశీలనపై మాకు నమ్మకం లేదు.. ఉద్యోగులకి చ్చిన హెల్త్ కార్డులు.. అనారోగ్య కార్డులుగా మారాయని విమర్శించిన బొప్పరాజు.. ఈ నెల 27న ఏపీఎన్జీవో జనరల్ బాడీ సమావేశం.. 28వ తేదీన మా రెండు జేఏసీలు సమావేశం అవుతాం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని.. మేం పోరుబాట పట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!