NTV Telugu Site icon

టీఆర్ఎస్ పార్టీలో ఎన్నిక‌ల సంద‌డి…

టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, గ్రామ‌, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీలు పూర్త‌య్యాయ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైన‌ట్టు కేటీఆర్ తెలిపారు.  2019 ఎన్నిక‌ల కార‌ణంగా పార్టీ ప్లీన‌రీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌లేక‌పోయామ‌ని, ఆ త‌రువాత క‌రోనా కార‌ణంగా రెండేళ్లపాటు ప్లీన‌రీని నిర్వ‌హించ‌లేద‌ని, న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో విజ‌య‌గ‌ర్జ‌న జ‌రుగుతుంద‌ని అన్నారు.  ఇక పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.  అక్టోబ‌ర్ 17 వ తేదీన ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్ చేస్తామ‌ని, అక్టోబ‌ర్ 22 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని, అక్టోబ‌ర్ 25 న పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుంద‌ని అన్నారు.  అద్య‌క్షుడి ఎన్నిక అనంత‌రం అదే రోజున జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఉంటుంద‌ని అన్నారు.  పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ హైటెక్స్‌లో నిర్వ‌హిస్తామ‌ని అన్నారు.  సుమారు 13 వేల మంది ప్ర‌తినిధులు ఈ అధ్య‌క్ష ఎన్నిక స‌మావేశంకు వ‌స్తార‌ని తెలిపారు.  న‌వంబ‌ర్ 15 న వ‌రంగ‌ల్‌లో జ‌రిగే విజ‌య గ‌ర్జ‌న‌కు ల‌క్ష‌లాది మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, ప్ర‌జ‌లు క‌దిలి వ‌స్తార‌ని కేటీఆర్ తెలిపారు.

Read: తెలంగాణ‌లో బొగ్గుగ‌నుల‌పై కేంద్రం దృష్టి… ఇత‌ర ప్రాంతాల‌కు పంపాల‌ని ఆదేశం…