జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రిపై హెచ్చార్సీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని రోగులు వాటిని ఆశ్రయిస్తుంటారు. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్పుకోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత ఏడాది జరిగిన ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన కాన్పు కోసం చేరిన బొంతు సునీత అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది. కాన్పు కోసం సర్జరీ కిట్ బయట నుండి కొనుగోలు చేసి తీసుకురావాలని భర్త బొంతు మధు కి తెలిపారు ఆసుపత్రి సిబ్బంది. పురిటి నొప్పులు ఎక్కువగా వస్తున్నా కూడా స్పందించలేదు ఏరియా ఆసుపత్రి సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం పదివేలు, కోవిడ్ పరీక్షకు ఐదువందల రూపాయలు డిమాండ్ చేశారని బాధితులు మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేశారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ఇదేమని అడిగిన భర్త మధు పై దుర్భాషలాడారు వైద్య సిబ్బంది. గత్యంతరం లేక భార్యని కాన్పు కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు భర్త బొంతు మధు. జరిగిన అన్యాయం పై హెచ్చార్సీని ఆశ్రయించారు దంపతులు. హెచ్.ఆర్.సి ఆదేశాలతో ఆసుపత్రిలో విచారణ చేపట్టారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ ఎం.పద్మ, ఆమె బృందం. విచారణ ఆనతరం పూర్తి వివరాలని హెచ్చార్సీకి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!