ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్రమత్తమైన అధికారులు…
దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి.
Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్లు ధరించకుంటే…
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
అయితే టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. డిసెంబర్ 4న సదరు వ్యక్తి టాంజానియా నుంచి వచ్చాడు. దీంతో ముంబై మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ను ట్రేసే చేసేపనిలో ఉన్నారు అధికారులు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తిస్థాయిలో ఎయిర్పోర్ట్లో పరీక్షలు చేస్తున్నారు. అయితే, టాంజానియా దేశం ఎట్ రిస్క్ జాబితాలో లేకపోవడంతో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సాధారణంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఇలా పరీక్షలకు పంపిన శాంపిల్స్లో టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరడంతో జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా అక్కడ ఒమిక్రాన్గా నిర్థారణ జరిగింది. వెంటనే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఆ వ్యక్తిని ఐసోలేషన్ కేంద్రానికి పంపి చికిత్స చేస్తున్నారు. ధారావి మురికివాడలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు వార్తలు బయటకు రావడంతో ఆ ప్రాంతం మొత్తం వణికిపోయింది. రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏడు లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటరైతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ సమయంలో ధారావి నుంచే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!