ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముమాబీ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకుకోవడంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో ముంబై, ఢిల్లీ జట్లు ఒక్కో మార్పుతో వస్తున్నాయి. ముంబై జట్టు రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ ను జట్టులోకి తీసుకొని రాగ ఢిల్లీ జట్టులో లలిత్ యాదవ్ స్థానంలో పృథ్వీ షా తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఢిల్లీ జట్టు ఐపీఎల్ 2021 లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒక వేళా ముంబై గెలిస్తే ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి వచ్చి చేరుతుంది. కాబట్టి రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలవాలనే చుస్తునాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.