Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cpi Ramakrishna Expresses In Ntv Face To Face

మోడీని గద్దెదించడమే మా లక్ష్యం-సీపీఐ రామకృష్ణ

Published Date :January 16, 2022 , 7:48 pm
By NTV WebDesk
మోడీని గద్దెదించడమే మా లక్ష్యం-సీపీఐ రామకృష్ణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు చెప్పిందే రామకృష్ణ చేస్తున్నారనే విమర్శలపై ఆయన స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలపై రామకృష్ణ తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల పాత్ర తగ్గుతోంది. పార్లమెంటులో 5 సీట్లే వున్నాయి.

ప్రజలకు ఇప్పుడున్న సమస్యలు వేరు. సమస్యల పరిష్కారం కోసం కొత్త పద్ధతులు కావాలి. ప్రజలకోసం పోరాటం చేయాలి. వర్గ పార్టీ కాబట్టి కష్టజీవులు, కార్మికులు, కర్షకుల కోసం మేం పోరాడుతున్నాం. మార్పులు వచ్చాయి. జనంతో సంబంధం లేని వ్యవస్థ వచ్చేసింది. వివిధ రకాల కార్మికులకు మేం భరోసా కల్పించాల్సి వుంది. అనేక కర్మాగారాల్లో మా యూనియన్లు వున్నాయి. భారతదేశంలో ఏఐటీయూసీ వుంది. బలంగా వుంది. సీపీఐఎం వచ్చాక సమ్మెలు చేయడానికి కార్మికులు ముందుకెళుతున్నారు. మేం సమ్మెకు పిలుపు ఇస్తే 25 నుంచి 30 కోట్ల మంది మాతో కలిసి వచ్చేవారు.

మా గురించి జాలి పడాల్సింది లేదు. ఉద్యమం మేం ఎవరికోసం చేస్తున్నామో వారికి తెలుసు. వారి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చాక వారికి వ్యతిరేకంగా విధానాలు తెస్తున్నారు. చైతన్యం తీసుకురావడంలో మేం ఫెయిలయ్యాం అంటున్నారు రామకృష్ణ. మేం స్వంతంగా పోటీచేసి గెలిచే అవకాశం వుంటే అలాగే వెళతాం. అన్నిపార్టీలు సర్దుబాటు చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా మేం వినియోగించుకోలేదు. పాకులాడి మేం ఎవరినీ ప్రొజెక్ట్ చేయలేదు. అది చారిత్రక తప్పిదం అని మేం అనుకోవడం లేదు.

ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మేం నిలబడ్డాం. కమ్యూనిస్టులు రాటుతేలి ఒక స్టాండ్ తీసుకుంటారని జనం నమ్ముతారు. కాంగ్రెస్ వచ్చి మాతో కలిశారు. ఒకే పక్క వారు వుంటారని అనుకోవడం లేదు. సందర్భాన్ని బట్టి మేం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక మతోన్మాద పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీని గద్దె దించాలని మేం పోరాటం చేస్తాం. బీజేపీని మేం ఒకరమే ఓడించలేం. కాబట్టి ఇతర పార్టీలు, లౌకిక శక్తులతో మేం చేతులు కలుపుతాం. 2014లో మాతో కలిసి వచ్చే పార్టీలతో మేం కలిసి పోటీ చేశాం. 2019లో జనసేనతో కలిశాం.

వ్యవస్థను మార్చడానికి మాకు కాస్త సమయం పడుతుంది. కొత్త పార్టీల వైపు మేం చూడలేదు. కొత్త పార్టీల వైపు మేం వెళ్ళడం లేదు. మాది పిడివాదం కాదు. వాళ్ళ సమస్య తీరేవరకూ వుంటున్నారు. తర్వాత వెళ్ళిపోతున్నారు. కమ్యూనిస్టుల పునరేకీకరణ కావాలి. రెండు పార్టీలతో పాటు మిగతా లెఫ్ట్ పార్టీలు కలవాలి. సీపీఎంలోనూ మార్పులు వచ్చాయి. వారు కూడా మారాలని అంటున్నారు రామకృష్ణ. మేం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాం. మళ్ళీ సరిదిద్దుకుంటున్నాం. ఇప్పడిప్పుడే విద్యార్ధులు మావైపు వస్తున్నారు.

151 సీట్లు ఇస్తే ఏదైనా చేయవచ్చా?

కేంద్రాన్ని కదిలించలేకపోయారు. రైతు ఉద్యమాలకు భయపడే మోడీ రైతుచట్టాలను రద్దుచేశారు. మా ఉద్యమమే లేకపోతే మోడీ మారేవారు కాదంటున్నారు. ఏపీలో జగన్ పాలన దారుణంగా వుంది. అప్పులు చేయడం ద్వారా ఏ ఒక్కరంగంలో అభివృద్ధి జరగలేదు. కరోనా సమయంలో పేదల్ని ఆదుకోవడాన్ని మేం అభినందిస్తున్నాం. లక్షల కోట్లు అప్పులు తేవడం అభివృద్ధా? పన్నులు పెరిగాయి. ఓటీఎస్ స్కీం, కరెంట్ ఛార్జీలు, విద్యుత్ సంస్కరణలు అమలుచేశారు. జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. అదానీకి అప్పగిస్తున్నారు. 9వేల మెగావాట్ల విద్యుత్ ఏపీకి రప్పిస్తున్నారు. పారదర్శకంగా చేయాలి. రూల్స్ పాటించడం లేదు. ఖచ్చితంగా కోర్టులో దొరికిపోతారు. 151 సీట్లు ఇస్తే ఏదైనా చేయవచ్చా? అన్ని సీట్లు గెలిచినా ప్రతిపక్షాలు వుండాలి. టీడీపీ చెబితేనే నేను చేస్తానని విమర్శలు రావడం సహజం. టీడీపీకి చెప్పేది తప్పే. పాలసీలను బట్టి మేం ముందుకు వెళుతున్నాం. చంద్రబాబుకి అనుకూలంగా వుంటారని అపవాదుపై ఆయన సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • bjp vs cpi
  • cpi leader ramakrishna
  • Left parties
  • ntv face to face

తాజావార్తలు

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

  • The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?

  • DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసింది..

  • Krithi Shetty: నా బ్రేకప్ మా అమ్మకు కూడా తెలుసు..ప్రస్తుతం సింగిల్‌నే!

  • Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్‌ ఫైర్!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions