టీనేజర్ల కోసం కరోనా వ్యాక్సిన్.. మార్గదర్శకాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వాళ్లు జనవరి 1 నుంచి కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. దీని కోసం చిన్నారులు విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది. వీళ్లు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొందరు చిన్నారులకు ఆధార్, ఇతర అవసరమైన ఐడీ కార్డులు ఉండకపోవచ్చని.. అందుకే విద్యాసంస్థల ఐడీ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు కోవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ వివరించారు.
15-18 ఏళ్ల వారు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి:
Also Read
కొవిన్ యాప్ లేదా వెబ్సైటులో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్కు వచ్చిన OTPని వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ లేదా విద్యాసంస్థకు సంబంధించిన ఐడీ నెంబర్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా లేదా జైడస్ కాడిల్లా టీకాను బుక్ చేసుకోవచ్చు. కోవిన్ యాప్లో అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోకపోతే నేరుగా ఏదైనా వ్యాక్సిన్ సెంటర్కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్ సమర్పించి కరోనా వ్యాక్సిన్ పొందవచ్చు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!