కరోనా ఎఫెక్ట్.. కాంతుల్లేని దీపావళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిండివంటలు, స్వీట్లు ప్రతి పండుగలోనూ కనిపిస్తాయి. కానీ దీపావళి సమ్ థింగ్ స్పెషల్ పండుగ. ప్రజలకు వెలుగుల పండుగ కాగా వ్యాపారులకు కాసులు కురిపించే పండగ. ప్రతి ఇంటి ముందూ విరజిమ్మే టపాసుల వెలుగులు తగ్గనుందా..? అన్న ఆందోళనలో ప్రజలు వున్నారు.
టపాసుల అమ్మకం కోసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అనే ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. మార్కెట్లో టపాసుల కొరత తీవ్రంగా వుంది. లాక్ డౌన్ లో ఉత్పత్తి లేకపోవడం… శివకాశీలో ప్రమాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి టపాసులు అంతగా కనిపించడం లేదు. రెట్టింపు ఇన్వెస్టిమెంట్ పెట్టినా.. స్టాక్ దొరకడం లేదు అంటున్నారు వ్యాపారులు. లాక్ డౌన్ వల్ల షాపులకు జనం రావడం లేదంటున్నారు. యువత ఎక్కువగా కొనుగోలు చేసే 10 థౌసండ్ వాలా, 5 థౌసండ్ వాలాలు దొరకడం లేదు. గతేడాది కంటే 10 నుంచి 20 శాతం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా ధరల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
దీపావళి క్రాకర్స్ ధరలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో దీపావళి కాంతులు పెద్దగా కనిపించడం లేదు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి ముసురు వాతావరణం ఉన్నా, వర్షాలు పడుతున్నా టపాసులు పేలడం కష్టం. దీంతో ఈ సంవత్సరం అమ్మకాలు ఏ విధంగా ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.ఏపీ అంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి శివకాశి, చెన్నై, పర్లాకిమిడి నుంచి టపాసులను తెప్పించిన వ్యాపారులకు వాతావరణం కలవరపాటుకు గురవుతున్నారు. దీపావళి పండగకు వారం పది రోజుల ముందు నుంచే టపాసుల మోత వినిపించేది. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి మారిపోయింది. ప్రతి సంవత్సరమూ వీటి ధరలు పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ఇందుకు కారణమని చెప్పొచ్చు.
గతంలో రూ.500లు ఖర్చు పెడితే ఒక మోస్తరుగా టపాసులు వచ్చేవి. ఈ ఏడాది ధరలు రెట్టింపు కావడంతో కొద్దిపాటి టపాసులు కావాలన్నా కనీసం రూ.1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో టపాసుల సంగతి అలా ఉంచితే కొవ్వొత్తులతోనే సరిపెట్టుకుందామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరోవైపు గ్రీన్ టపాసులనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..