మొన్న ముత్తంగి. ఇవాళ ఇంద్రేశం.. కరోనా వీరవిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లాపై కరోనా పడగ విప్పిందా? చిన్నపాటి నిర్లక్ష్యం విద్యార్ధులు, విద్యార్ధినుల పాలిట శాపంగా మారిందా? గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు అంత సేఫ్ కాదా? అంటే అవుననే అంటున్నారు. హైదరాబాద్ను ఆనుకుని వున్న సంగారెడ్డి జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజాగా ఇంద్రేశంలో కేసులు బయటపడడం ఆందోళనకరంగా మారింది.తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది.
READ ALSO కరోనా సోకిన బాలికల్లో 25 మందికి అస్వస్థత
Also Read
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కరోనా కేసులు బయటపడ్డాయి. గురుకుల బాలికల పాఠశాలలో గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 25 మందికి విద్యార్ధినిలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధినులు ఆందోళనకు గురవుతున్నారు. గత వారమే ముత్తంగిలోని గురుకుల పాఠశాలలో కరోనా కలవరం కలిగించిన సంగతి తెలిసిందే. మిగతా విద్యార్ధులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇటీవల పటాన్చెరు మండలం ముత్తంగిలో కరోనా కలకలం రేపింది. ముత్తంగి గురుకుల పాఠశాలలోని 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కరోనా సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో 25 మంది విద్యార్థినీలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వీరితో పాటు మరో ముగ్గురు బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!