కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం: 40 శాతం సీట్లు మహిళలకే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ ప్రయత్నిస్తున్నది. అవకాశం ఉన్న ఏ అంశాన్ని కూడా వదుకుకోవడంలేదు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీ తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. రైతుల నిరసలకు మద్ధతు తెలపడమే కాకుండా వారితో కలిసి పోరాటం చేశారు. లఖింపూర్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు, పోరాటం చేసిన విధానం ఆ పార్టీకి కొంతమేర కలిసివస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకోవడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ తెలిపారు. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా బీజేపీ, కాంగ్రెస్, యూపీ మధ్య త్రిముఖపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందస్తు సర్వేలు బీజేపీకి అవకాశం ఉన్నట్టు చెప్పినా, లఖింపూర్ ఘటనల తరువాత ఫలితాలు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read: ఆఫ్ఘనిస్తాన్లో ఆ ముగ్గురిదే కీలక పాత్ర… కానీ చివరకు…
Also Read
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!