జేసీపై జీవన్రెడ్డి సీరియస్.. తప్పైపోయిందన్న జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్రెడ్డి హితోక్తులు అవసరం లేదన్న ఆయన.. మంచి ఏదైనా ఉంటే చెప్పాలి.. కానీ, పార్టీ డ్యామేజ్ అయ్యేలా కామెంట్ చేయొద్దని జేసీకి సూచించారు. పార్టీకి మంచి చేయని మాటలు దయజేసి ఇక్కడ మాట్లాడొద్దు అంటూ రెండు చేతులు జోడించి జేసీని కోరారు జీవన్ రెడ్డి.. ఇక, దీనికి బదులిచ్చిన జేసీ.. ఇకపై మాట్లాడను.. నాకు దండం పెట్టొద్దు.. మాట్లాడను అంతే.. తప్పు అయిపోయిందన్నారు జేసీ.
కాగా, తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయానన్నారు జేసీ దివాకర్రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ప్రత్యక్షమైన జేసీ.. సీఎం కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానన్నారు.. మంత్రి కేటీఆర్ ను కలిసానని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానన్న ఆయన.. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవన్నారు.. ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదన్నారు జేసీ.
Also Read
తాజావార్తలు
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!