Shyam Rangeela: మోడీ గెటప్లో హాస్యనటుడు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, హాస్యనటుడు శ్యామ్ రంగీలాకు సోమవారం జైపూర్లోని ప్రాంతీయ అటవీ అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసు అందజేసింది. జైపూర్ నగరంలోని ఝలానా చిరుతపులి రిజర్వ్లో నీల్గాయ్కు ఆహారం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడవి పర్యటన సందర్భంగా నరేంద్రమోడీ దుస్తులను పోలిన వేషధారణలో శ్యామ్ రంగీలా కనిపించాడు. ప్రధాని మోడీ అడవి పర్యటన తరహాలో ఉన్న వేషధారణ వైరల్గా మారింది.
Also Read: Jagadish Shettar: కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం.. కన్నీటి పర్యంతమైన భార్య
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్లో ఇటీవల జంగిల్ సఫారీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన దుస్తులను పోలిన దుస్తుల్లోహాస్యనటుడు కనిపించాడు. మోడీ మాదిరిగా దుస్తులు,టోపీ, సన్ గ్లాసెస్, హాఫ్ స్లీవ్ జాకెట్ ధరించి శ్యామ్ కనిపించాడు. అయితే, జైపూర్లోని ఝలానాలో జంగిల్ సఫారీలో నీల్గాయ్కు ఆహారం ఇస్తూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించినందున శ్యామ్కు నోటీసులు అందాయి.అతను సఫారీకి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 13న శ్యామ్ రంగీలా అనే యూట్యూబ్ ఛానెల్లో ఝలానా చిరుతపులి రిజర్వ్ వీడియోను అప్లోడ్ చేసినట్లు జైపూర్ ప్రాంతీయ అటవీ అధికారి జనేశ్వర్ చౌదరి తెలిపారు. వీడియోలో, శ్యామ్ తన కారు నుండి దిగి, తన చేతితో నీల్గాయ్కి ఆహారం తినిపిస్తున్నాడు.
Also Read:Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్తో సహజీవనం.. కట్ చేస్తే..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
వన్యప్రాణులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం 1953, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం నింధనలు ఉల్లంఘించడమే. అడవి జంతువులకు ఆహారం ఇవ్వడం వల్ల తీవ్రమైన వ్యాధులు, అంటువ్యాధులు సంభవిస్తాయి. వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంది. అలాగే, ఝలానా అడవిలో వన్యప్రాణులకు ఆహారం ఇవ్వడంపై నిషేధాన్ని సూచిస్తూ హెచ్చరిక, సమాచార బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. శ్యామ్ రంగీలా వన్యప్రాణుల నేరానికి పాల్పడడమే కాకుండా, వీడియోను ప్రసారం చేయడం ద్వారా ఇతరులను నేరపూరిత చర్యలకు ప్రేరేపించాడని అటవీ శాఖ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై విచారణ తర్వాత ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అధికారి చెప్పారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!