బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే వైసీపీ, టీడీపీ గుండెల్లో భయం పట్టుకుందన్నారు ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని, పయ్యావుల కామెంట్లు ఆ భయం నుంచి వచ్చినవే. వైసీపీలో ఏం జరుగుతుందో పేర్ని నాని ఆలోచించుకోవాలి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు సహా కార్యకర్తలు.. నేతలు ఏం మాట్లాడుతున్నారో పేర్ని నాని గమనించాలని హితవు పలికారు.
వైసీపీలో అంతర్గత పోరు ఉంది. టీడీపీ ప్రతిపక్షంగా ఫెయిలైంది. వైసీపీ చేసిన తప్పులను ప్రజలకు పార్టీ అగ్ర నేతలు ప్రజాగ్రహ సభలో వివరిస్తారు. కేంద్రం ఇక్కడి పరిస్థితులను టెలిస్కోపులో చూస్తోందనేది ముమ్మాటికీ వాస్తవం.నేను మాట్లాడినా. సుజనా మాట్లాడినా.. కేంద్రం అనుకుంటున్నవే మేం చెబుతున్నాం.సభ ప్రారంభం కాక ముందే పేర్ని నానికి దడ ప్రారంభమైంది.
ప్రతిపక్షంగా టీడీపీ ఫెయిలైందనే విషయాన్ని పయ్యావుల గమనించాలి.అధికారులు.. పోలీసుల తీరుపై టెలిస్కోప్ అంటూ నేను కామెంట్లు చేశాక చాలా మంది ఏపీ అధికారులు నాకు ఫోన్ చేశారు.మేం ఇక్కడ పని చేయలేకపోతున్నాం.. కేంద్రం జోక్యం చేసుకుంటేనే మంచిదని ఏపీ అధికారులే చెబుతున్నారు.సభలో ఏం చెబుతామో చూడండి అంటూ చురకలు అంటించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.