బీజేపీ సభ అంటే వైసీపీ, టీడీపీలకు భయం
బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే వైసీపీ, టీడీపీ గుండెల్లో భయం పట్టుకుందన్నారు ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని, పయ్యావుల కామెంట్లు ఆ భయం నుంచి వచ్చినవే. వైసీపీలో ఏం జరుగుతుందో పేర్ని నాని ఆలోచించుకోవాలి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు సహా కార్యకర్తలు.. నేతలు ఏం మాట్లాడుతున్నారో పేర్ని నాని గమనించాలని హితవు పలికారు.
వైసీపీలో అంతర్గత పోరు ఉంది. టీడీపీ ప్రతిపక్షంగా ఫెయిలైంది. వైసీపీ చేసిన తప్పులను ప్రజలకు పార్టీ అగ్ర నేతలు ప్రజాగ్రహ సభలో వివరిస్తారు. కేంద్రం ఇక్కడి పరిస్థితులను టెలిస్కోపులో చూస్తోందనేది ముమ్మాటికీ వాస్తవం.నేను మాట్లాడినా. సుజనా మాట్లాడినా.. కేంద్రం అనుకుంటున్నవే మేం చెబుతున్నాం.సభ ప్రారంభం కాక ముందే పేర్ని నానికి దడ ప్రారంభమైంది.
ప్రతిపక్షంగా టీడీపీ ఫెయిలైందనే విషయాన్ని పయ్యావుల గమనించాలి.అధికారులు.. పోలీసుల తీరుపై టెలిస్కోప్ అంటూ నేను కామెంట్లు చేశాక చాలా మంది ఏపీ అధికారులు నాకు ఫోన్ చేశారు.మేం ఇక్కడ పని చేయలేకపోతున్నాం.. కేంద్రం జోక్యం చేసుకుంటేనే మంచిదని ఏపీ అధికారులే చెబుతున్నారు.సభలో ఏం చెబుతామో చూడండి అంటూ చురకలు అంటించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!