NTV Telugu Site icon

మళ్లీ మీడియా ముందుకు కేసీఆర్.. ఇవాళ ఏముందో మరి..?

తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేవారు.. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రగ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడనున్నారు.. అయితే, ఇవాళ సీఎం ఎవరిని టార్గెట్‌ చేస్తారు..? ఎవరిపై మాటల దాడికి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. ఆదివారం రాత్రి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీరియస్‌గా స్పందించారు.. అంతేకాదు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు..

ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధన్యం కొనుగోళ్లపై సవాల్‌ విసిరారు.. మరోవైపు.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు అదే స్థాయిలో బీజేపీ తెలంగాణ చీఫ్‌ కౌంటర్‌ ఇచ్చారు.. ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌ అంటూ మీడియాకు సమాచారం వచ్చింది.. దీంతో.. ఇప్పటి వరకు సహించాం.. ఇక ఊరుకునేది లేదంటూ నిన్నే హెచ్చరించిన ఆయన.. ఇవాళ మరింత ఘాటుగా స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. కేసీఆర్‌ లైవ్‌ను వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..