ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని కోరింది సీబీఐ. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు సీబీఐ. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించిందని సీబీఐ వాదించింది.
జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం వుందని సీబీఐ తన వాదనల్లో పేర్కొంది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని తెలిపింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ కోర్టుకి తెలిపింది. సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.