మంత్రి తలసానితో సినీ ప్రముఖుల భేటీ.. అజెండా అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్లు ఎలా నిర్వహించాలి, నిబంధనలు, కోవిడ్ ప్రోటోకాల్ వంటి అంశాలపై తలసానితో చర్చిస్తున్నారు సినీ ప్రముఖులు.
మరో వైపు తెలంగాణలోని థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. తెలంగాణలోని సినిమా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల సందర్భంగా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ బుధవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ధరలు పెంచాలని కోరుతూ థియేటర్లు పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ప, తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ఒక్కో టికెట్ పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే, కేసీఆర్ సర్కారు దీనికి స్పందించలేదు. దీంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. థియేటర్ యజమానుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దాంతో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల ధరలు పెరిగే అవకాశం వుంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!