బోర్డర్లో మళ్లీ ఉద్రిక్తత: ఎల్ఏసీకి డ్రాగన్ రాకెట్లు…
శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. మంచుదుప్పట్లు కప్పేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డర్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ కి పడిపోతాయి. అలాంటి సమయంలో అక్కడ పహారా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎంతటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకొని భారత సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే, ఇటీవలే ఇండియా చైనా దేశాల మధ్య 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో చైనా మళ్లీ తన పాత పంంథాను అనుసరించడం మొదలుపెట్టింది. ఇండియాను భయపెట్టేందుకు బోర్డర్ ప్రాంతానికి 100 రాకెట్లను తరలించింది. అయితే, భారత సైనికులు అలవాటు పడిన విధంగా చైనా సైన్యం అతి శీతల ఉష్ణోగ్రతలు తట్టుకొని మనుగడ సాగించలేరని నిపుణులు చెబుతున్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితులకు డ్రాగన్ సైనికులు అలవాటు పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు విఫలమయ్యాక డ్రాగన్ 100 పీసీఎల్ 181 లైట్ ట్రక్ మౌంటెడ్ హోవిట్జర్లను తరలించింది. భారత్ ఇప్పటికే ఎం 777 రాకెట్ లాంచర్లను తరలించిన సంగతి తెలిసిందే. చైనా పీసీఎల్ 181 కంటే ముందే పీసీఎల్ 191 రాకెట్ లాంచర్లను కూడా ఎల్ఏసీకి తరలించింది. డ్రాగన్ ఎన్ని ఆయుధాలను తరలించినా, చైనా ఆర్మీ కఠినమైన వాతారవణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలగాలని, అప్పుడే ఫలితం ఉంటుందని, వాతారణ పరిస్థితులను భారత సైన్యం తట్టుకొని నిలబడగలదని అధికారులు చెబుతున్నారు. ఇక భారత్ శీతాకాలంలో సైనిక సంపత్తితో పాటుగా సరిహద్దుల్లో రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లు ఏర్పాటు చేసింది. ఎల్ఏసీ ఆవల చైనా సైనికులను కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్వేర్ను తయారు చేసింది భారత్. ఫేస్ రికగ్నైజర్గా పిలిచే ఈ సాప్ట్వేర్ను భారత్ ఆర్మీ సొంతంగా తయారు చేసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ఆధారంగా చైనా సైనికుల కదలికలను ఎప్పటి కప్పుడు పసిగడుతుంది ఈ సాప్ట్వేర్.
Read: హిందువులపై దాడులను బీజేపీ ఎందుకు ఖండించడం లేదు
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!