బోర్డర్లో మళ్లీ ఉద్రిక్తత: ఎల్ఏసీకి డ్రాగన్ రాకెట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. మంచుదుప్పట్లు కప్పేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డర్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ కి పడిపోతాయి. అలాంటి సమయంలో అక్కడ పహారా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎంతటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకొని భారత సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే, ఇటీవలే ఇండియా చైనా దేశాల మధ్య 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో చైనా మళ్లీ తన పాత పంంథాను అనుసరించడం మొదలుపెట్టింది. ఇండియాను భయపెట్టేందుకు బోర్డర్ ప్రాంతానికి 100 రాకెట్లను తరలించింది. అయితే, భారత సైనికులు అలవాటు పడిన విధంగా చైనా సైన్యం అతి శీతల ఉష్ణోగ్రతలు తట్టుకొని మనుగడ సాగించలేరని నిపుణులు చెబుతున్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితులకు డ్రాగన్ సైనికులు అలవాటు పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్చలు విఫలమయ్యాక డ్రాగన్ 100 పీసీఎల్ 181 లైట్ ట్రక్ మౌంటెడ్ హోవిట్జర్లను తరలించింది. భారత్ ఇప్పటికే ఎం 777 రాకెట్ లాంచర్లను తరలించిన సంగతి తెలిసిందే. చైనా పీసీఎల్ 181 కంటే ముందే పీసీఎల్ 191 రాకెట్ లాంచర్లను కూడా ఎల్ఏసీకి తరలించింది. డ్రాగన్ ఎన్ని ఆయుధాలను తరలించినా, చైనా ఆర్మీ కఠినమైన వాతారవణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలగాలని, అప్పుడే ఫలితం ఉంటుందని, వాతారణ పరిస్థితులను భారత సైన్యం తట్టుకొని నిలబడగలదని అధికారులు చెబుతున్నారు. ఇక భారత్ శీతాకాలంలో సైనిక సంపత్తితో పాటుగా సరిహద్దుల్లో రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లు ఏర్పాటు చేసింది. ఎల్ఏసీ ఆవల చైనా సైనికులను కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్వేర్ను తయారు చేసింది భారత్. ఫేస్ రికగ్నైజర్గా పిలిచే ఈ సాప్ట్వేర్ను భారత్ ఆర్మీ సొంతంగా తయారు చేసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ఆధారంగా చైనా సైనికుల కదలికలను ఎప్పటి కప్పుడు పసిగడుతుంది ఈ సాప్ట్వేర్.
Read: హిందువులపై దాడులను బీజేపీ ఎందుకు ఖండించడం లేదు
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
తాజావార్తలు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!