ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు కోరారు.
Read Also: హైదరాబాద్లో కొత్తగా ప్రారంభమైన 32 బస్తీ దవాఖానాలు
Also Read
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
మరోవైపు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ప్రకటన చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని… బాయిల్డ్ రైస్ కొంటారో లేదో చెప్పాలన్నారు. గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారని… ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇంకా ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు.
అయితే దీనికి సమాధానంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పుడేమీ స్పష్టంగా చెప్పలేమని.. ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఆలోచిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుందన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను పెంచుతామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ప్రస్తుత సీజన్లో అందివ్వాల్సిన బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని ఆయన చురకలు అంటించారు.
తాజావార్తలు
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!