ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు కోరారు.
Read Also: హైదరాబాద్లో కొత్తగా ప్రారంభమైన 32 బస్తీ దవాఖానాలు
Also Read
మరోవైపు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ప్రకటన చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని… బాయిల్డ్ రైస్ కొంటారో లేదో చెప్పాలన్నారు. గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారని… ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇంకా ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు.
అయితే దీనికి సమాధానంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పుడేమీ స్పష్టంగా చెప్పలేమని.. ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఆలోచిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుందన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను పెంచుతామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ప్రస్తుత సీజన్లో అందివ్వాల్సిన బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని ఆయన చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!