ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన తెలియజేశారు. వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని, తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు కోరారు.
Read Also: హైదరాబాద్లో కొత్తగా ప్రారంభమైన 32 బస్తీ దవాఖానాలు
Also Read
మరోవైపు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ప్రకటన చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని… బాయిల్డ్ రైస్ కొంటారో లేదో చెప్పాలన్నారు. గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారని… ఈ ఏడాది ఇప్పటివరకు 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇంకా ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు.
అయితే దీనికి సమాధానంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పుడేమీ స్పష్టంగా చెప్పలేమని.. ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఆలోచిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుందన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను పెంచుతామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ప్రస్తుత సీజన్లో అందివ్వాల్సిన బియ్యాన్నే తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని ఆయన చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
-
Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!