Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్గేట్స్ని దాటేసిన అదానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ బిల్గేట్స్ని దాటేశారు. గౌతమ్ అదానీ తాజాగా 4వ స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్గేట్స్ తన సంపదలోని 20 బిలియన్ డాలర్లను దానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్ &మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే తన కుటుంబ అధీనంలోని స్వచ్ఛంద సంస్థకి ఈ విరాళం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయన నికర సంపద 102 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరో వైపు గౌతమ్ అదానీ 114 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో బెస్ట్ ర్యాంక్ సాధించారు.
బిర్లా గ్రూప్ భారీ వ్యయం
Also Read
- Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్... కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
- QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
బిల్డింగ్ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ సెగ్మెంట్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)ల కోసం ఇ-కామర్స్ వెంచర్ అందుబాటులోకి రానుంది. దీనికోసం బిర్లా గ్రూప్ 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనుంది. బిజినెస్ టు బిజినెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టేందుకే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని రూపొందించనున్నారు. గడచిన మూడేళ్ల ఈ సెక్టార్లో 14 శాతానికి పైగా వృద్ధి నమోదు కావటం గమనార్హం. ఇదిలాఉండగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
read more: Ravi Teja : ఆ వార్తల్లో నిజం లేదు.. ఇదే నిజం..
8-8.5 శాతం వృద్ధి సాధిస్తాం
వచ్చే ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో 8 నుంచి 8.5 శాతం వరకు వృద్ధి సాధిస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. హైఫ్రీక్వెన్సీ సూచికల ఆధారంగా సర్కారు ఈ అంచనాకొచ్చింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని/సెస్ను కూడా తగ్గించామని చెప్పారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,550 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు ప్రపంచ మార్కెట్లలో పాజిటివ్ సాంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో కీలకమైన రంగాలకు భారీ లాభాలు వచ్చాయి. ఈ లిస్టులో ఐటీ, మెటల్, ఆయిల్, గ్యాస్ తదితర సెక్టార్లు ఉన్నాయి. వీటి షేర్ల విలువ నిఫ్టీలో 2 శాతం చొప్పున పెరిగింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!