Budget Session: రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల టార్గెట్ ఆదే అంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు.
బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర సంస్థల చర్య, అదానీ గ్రూపుపై ఆరోపణలు వంటి అంశాలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని నిలదీసే అవకాశాలు ఉన్నాయి. అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో పోరాడనుంది. తొలి విడత సమావేశాల్లోనూ ఆదానీ వ్యవహారం ఉభయ సభలను కుదిపేశాయి. అయితే, ఆర్థిక బిల్లును ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశం అని కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాతే ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు.
Also Read:MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. కాసేపట్లో పోలింగ్
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించి తమ వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఉదయం సమావేశమవుతాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో విపక్షాలు సమావేశమై ధరల పెరుగుదల, ఫెడరల్ ఏజెన్సీల దుర్వినియోగం వంటి వివాదాస్పద అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీలు ఉదయం 9.30 గంటలకు సమావేశం కానున్నారు. లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందని అన్నారు.”మేము ప్రజల సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తాం. ధరల పెరుగుదల, LPG ధర, అదానీ, ఏజెన్సీల దుర్వినియోగం, రైతుల సమస్యలు, గవర్నర్ల జోక్యం వంటి అంశాలపై మా పార్టీ పోరాటం చేస్తుంది’ అని అన్నారు.
Also Read:Kiran Kumar Reddy: కాంగ్రెస్కి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా.. త్వరలోనే ఆ పార్టీలోకి?
కాగా, ప్రతిపక్ష పార్టీలు తమ నాయకులపై ఇటీవల సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడుల అంశాన్ని కూడా పెద్ద ఎత్తున లేవనెత్తే అవకాశం ఉంది. వీరిలో కొందరిని వివిధ కేసులలో ప్రశ్నించడం, అరెస్టు చేయడం కూడా జరిగింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రత్యర్థి పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆయా పార్టీల నేతలు ఆరోపించారు.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!