15 నెలలుగా ఆ ఆసుపత్రి మార్చరీలోనే శవాలు… పట్టించుకోని అధికారులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా అధిక సంఖ్యలో సంభవించాయి. కరోనా కాలంలో మరణించిన వ్యక్తులను ప్రభుత్వమే ఖననం చేసింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం కాలంగా రెండు మృతదేహాలు ఖననం చేయకుండా మార్చరీలోనే ఉండిపోయాయి. అయితే, డిసెంబర్ 2020 లో ఈ ఆసుపత్రిలోనే కొత్త మార్చరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త మార్చరీలోకి పాత మార్చరీ సామాగ్రిని తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Read: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…
Also Read
ఈ సమయంలో మార్చరీలోని ఫ్రీజింగ్ బాక్స్లో రెండు శవాలు కనిపించాయి. జులై 2020లో కరోనాతో మృతిచెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. కొన్ని కారణాల వలన ఈ రెండు శవాలను అప్పటి నుంచి ఖననం చేయకుండా అలానే వదిలేయడంతో అవి గుర్తుపట్టలేనంతగా కుళ్లిన స్థితికి చేరుకున్నాయి. మార్చరీ ప్రాంతం మొత్తం కుళ్లిన వాసనతో నిండిపోయింది. రాజాజీనగర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ సురేష్ కుమార్ కర్ణాటక లేబర్ మంత్రి శివరామ్ హెబ్బార్కు లేఖ రాశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!