15 నెలలుగా ఆ ఆసుపత్రి మార్చరీలోనే శవాలు… పట్టించుకోని అధికారులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా అధిక సంఖ్యలో సంభవించాయి. కరోనా కాలంలో మరణించిన వ్యక్తులను ప్రభుత్వమే ఖననం చేసింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం కాలంగా రెండు మృతదేహాలు ఖననం చేయకుండా మార్చరీలోనే ఉండిపోయాయి. అయితే, డిసెంబర్ 2020 లో ఈ ఆసుపత్రిలోనే కొత్త మార్చరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త మార్చరీలోకి పాత మార్చరీ సామాగ్రిని తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Read: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…
Also Read
ఈ సమయంలో మార్చరీలోని ఫ్రీజింగ్ బాక్స్లో రెండు శవాలు కనిపించాయి. జులై 2020లో కరోనాతో మృతిచెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. కొన్ని కారణాల వలన ఈ రెండు శవాలను అప్పటి నుంచి ఖననం చేయకుండా అలానే వదిలేయడంతో అవి గుర్తుపట్టలేనంతగా కుళ్లిన స్థితికి చేరుకున్నాయి. మార్చరీ ప్రాంతం మొత్తం కుళ్లిన వాసనతో నిండిపోయింది. రాజాజీనగర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ సురేష్ కుమార్ కర్ణాటక లేబర్ మంత్రి శివరామ్ హెబ్బార్కు లేఖ రాశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..