సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా రంగంపై జగన్ సర్కార్ అనవసర జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ప్రభుత్వ వైఫల్యాలపై 28వ తేదీన ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆహ్వానించామన్నారు. ఆర్ధిక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ కొట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం వనరులు వినియోగించుకోకుండా అప్పులు చేస్తుంది. కాగ్ కూడా అనేక అభ్యంతరాలు లేవనెత్తింది. ఆదాయం సమకూర్చకుండా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో అన్ని రంగాలను ప్రముఖులు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. విద్యార్థులు, యువత, పారిశ్రామిక వేత్తలు తెలంగాణ, కర్ణాటకకు వలస వెళ్తున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థలను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. సినిమా రంగంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటుందన్నారు. కొన్ని థియేటర్లను మాత్రమే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తుంది..?ప్రభుత్వం పట్ల సానుకూల భావన లేదని సినిమా రంగంపై దాడులు చేయిస్తున్నారా..?ప్రభుత్వ వైఖరి కారణంగా సినిమా రంగంపై ఆధారపడిన వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.వికేంద్రీకరణ పేరుతో ఏకీకృత వ్యవస్థను అమలు చేసి జె టాక్స్ అమలు చేయాలని చూస్తున్నారు.
రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు ప్రభుత్వం గురి చేస్తుంది.రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రభుత్వం బెదిరిస్తుంది.జగన్ ఆస్తులు తెలంగాణ, కర్ణాటకలో ఉండటంతో ఆయా రాష్ట్రాలకు వ్యాపారులను తరిమేసినట్లుగా అనిపిస్తుందన్నారు మాధవ్.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..