నిమజ్జనం ప్రజల హక్కు, ప్రభుత్వానిదే బాధ్యత-గణేష్ ఉత్సవ సమితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ రిపోర్ట్లో లేదన్నారు భగవంత్ రావు.. నాలాలు కలుషిత నీటితోనే హుస్సేన్ సాగర్లో నీరు కలుషితం అవుతుందన్న ఆయన.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నీరు 100 శాతం కలుషితం అయ్యిందని.. 365 రోజులు పరిశ్రమల, నాళాల నీరు హుస్సేన్ సాగర్ లోకి వస్తుంటే.. కలుషితం కావడం లేదా? గణేష్ నిమజ్జనం ద్వారా హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది అని ఎవరు తేల్చారు? అని ప్రశ్నించారు.
ఎక్కడ కూడా నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు భగవంత్ రావు.. గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా కాలుష్యం కాదన్న ఆయన.. ప్రతిష్టించిన విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలి.. విగ్రహాలు రోడ్లపై అలాగే ఉండాలా ? అని ప్రశ్నించారు.. ప్రభుత్వ అధికారులే కోర్టుకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఆరోపించిన భగవంత్రావు.. ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిందని.. కోర్టుకు సరైన వివరాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. మరోవైపు.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు చెబుతున్నాయని కామెంట్ చేసిన ఆయన.. కోర్టు తన పరిధిలో లేని విషయాలు ప్రజలపై రుద్దుతుందని వ్యాఖ్యానించారు.. కోర్టులు సంప్రదాయాలకు… ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీర్పు ఇవ్వాలన్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక, ఎకో ఫ్రెండ్లీ కలర్లు ఎక్కడ దొరుకుతాయో ప్రభుత్వం చెప్పాలని నిలదీసిన భగవంత్ రావు.. ప్రభుత్వం ఎకో ఫెండ్లీ వినాయకులను అందుబాటులో ఉంచదు.. కానీ, రసాయన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
Also Read
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- Murmu: జెన్-జీపై తొలిసారి స్పందించిన ముర్ము.. ఏమన్నారంటే..!
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- Bhopal: భోపాల్లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్కు వెళ్లాక ప్రియుడితో స్టాల్కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!