కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. నేను చనిపోయేవరకు కూడా ఆగలేరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. తాజాగా మరోసారి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. మాన్సాన్ ట్రస్ట్ విషయంలో నా నియామకంపై హైకోర్టు మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.. వరసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడంలేదని మండిపడ్డారు.. కోర్టులో ప్రభుత్వానికి ప్రతిసారి చుక్కెదురవ్వడంపై ఆలోచించుకోవాలని సూచించిన ఆయన.. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం మాన్సాస్ వ్యవహారంలో తలదూర్చిందన్నారు.. ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్ ని డ్యామేజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. హైకోర్టు చెప్పినా కూడా ఇప్పటివరకు ఈవో నన్ను కలవలేదన్నారు.. నేను ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదు.. నేను అడిగిన వివరాలు కరెక్ట్గా ఇవ్వలేదు.. ప్రభుత్వం అడ్డుగోలు వ్యవహారాలు చేస్తూ, దేవాలయాలను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింహాచలంలో సీతారాములు కోవెలలో కూలిన ధ్వజస్తంభం పై వివరాలు కోసం రిపోర్ట్ అడుగుతాను అన్నారు అశోక్గజపతిరాజు.. దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఆచారాలకు విరుద్ధంగా నియమాలు మార్చారని ఆరోపించారు.. దేవాలయాలు పై దాడులు చేసిన పట్టించుకోలేదు.. డబ్బులు వచ్చే దేవాలయాలపై పెత్తనం చెలాయించడానికి ప్రభుత్వం చూస్తోందని.. దేవాలయాల ఆస్తులు కాజేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇక, హిందూమతం మీద దాడి చేస్తున్నారని విమర్శించిన అశోక్ గజపతిరాజు.. దేవాదాయశాఖ పూర్తిగా సక్రమంగా నడవడం లేదన్నారు. మరోవైపు.. జాయింట్ కలెక్టర్లకు ఆ శాఖ బాధ్యతలు అప్పజెప్పడం సరికాదన్న ఆయన.. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు.. దేవుడు మీద నమ్మకం లేనివల్లే ఇలాంటి పనులు చేస్తారని.. మాజీ చైర్మన్ ఉద్ధరించిది తక్కువ, అలజడి సృష్టించింది ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
చైర్మన్ సీటు కోసం చేసిన పోరాటం.. ట్రస్ట్ని బాగుచేయడం మీద లేదంటూ సెటైర్లు వేశారు అశోక్ గజపతిరాజు.. నా తర్వాత ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు.. నేను చనిపోయేంతవరకు కూడా ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఛైర్మన్ సీటు కోసం అన్ని రకాలుగా ప్రయత్నలు చేస్తున్నారు… సంచయిత గజపతిరాజు.. ఆవిడ కోసం కొన్న రెండు కార్లు ఇంతవరకు అప్పజెప్పారో లేదో ఈవో చెప్పలేదన్నారు.. సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం డబ్బులు లేవు అని చెప్పిన సంచయిత.. కోటి రూపాయలు పెట్టి రెండు కార్లు ఎలా కొన్నారని ప్రశ్నించారు.. ఏదో ఒక రోజు ఇవి అన్నీ బయటకు వస్తాయి.. మర్చిపోవద్దు అని హెచ్చరించారు.. ట్రస్ట్ బోర్డ్ వివరాలు ఇంతవరకు అడిగితే ఇవ్వలేదన్న ఆయన.. ఆడిట్ కోసం అడిగిన ప్రతిసారి మా దగ్గర స్టాఫ్ కొరత అని చెప్పారు.. కానీ, ఇప్పుడు అన్ని ఏళ్లు ఆడిట్ పెండింగ్ అని చెపుతున్నారని మండిపడ్డారు.. ఆడిట్ ని పెద్ద బూచి లాగా ప్రభుత్వం బయటకి చూపిస్తోందని విమర్శించారు. జనాల్ని మభ్యపెట్టడానికి విశ్వప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందని.. మాన్సాన్ ట్రస్ట్ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ట్యాక్స్గా కడుతుంటే.. మా మీద పెత్తనం చేయాలని చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!