శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలు , మంత్రి కొడాలి నానికి భద్రత పెంచింది ప్రభుత్వం. పౌరసరఫరాల మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రత పెంచారు. ఆయన భద్రతకు 17మంది వుంటారు. కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ ల తో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రత కల్పించింది ప్రభుత్వం. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదు. ఫిర్యాదుల పరిశీలన అనంతరం వారి భద్రతను సమీక్షించింది కమిటీ. వారికి తక్షణం భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. అయితే, తమకు అధికారిక సమాచారం లేదంటున్నారు ద్వారంపూడి, అంబటి రాంబాబు.