కోవిడ్ టీకాల్లో టాప్లో ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాపై పోరులో భారత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో వంద కోట్ల టీకాల మైలురాయిని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అవకాశాలను, వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. సోమవారానికి అది మరింత పెరగనుంది.
ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎక్కువ శాతం మందికి టీకాలిచ్చామని అధికారులు అంటున్నారు. గతంలో కోవిడ్ టెస్టుల్లోనూ ఏపీ ప్రత్యేకత సాధించింది.
Also Read
వ్యాక్సినేషన్ ఆరంభంలో దేశంలో తొలి మూడు నెలలు టీకాలు తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ముందుకు రాలేదు. ఏప్రిల్ నుంచి కేసులు పెరగడంతో ఒక్కసారిగా టీకాకు డిమాండ్ బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో వార్డు/గ్రామ సచివాలయాల వ్యవస్థ ఉండటం, వాలంటీర్లు చురుకుగా పనిచేస్తుండడంతో వ్యాక్సినేషన్ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ఎక్కువ మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో టీకాలు వేగంగా అందరికీ ఇవ్వగలగడం, గ్రామాల్లోనూ ప్రజలు ముందుకు వస్తుండడంతో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ టీకాల ప్రక్రియ నమోదు అవుతోంది. హెల్త్కేర్ వర్కర్లు.. ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారు, ఐదేళ్లలోపు చిన్నారులు తల్లులకు టీకాల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 18–44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది.
దేశంలో 5 కోట్ల టీకా డోసులు దాటిన రాష్ట్రాలు
ఉత్తర ప్రదేశ్ 12.54 కోట్లు
మహారాష్ట్ర 9..52 కోట్లు
గుజరాత్ 6.87 కోట్లు
రాజస్థాన్ 6.15 కోట్లు
కర్నాటక 6.33 కోట్లు
మధ్యప్రదేశ్ 6.85 కోట్లు
పశ్చిమబెంగాల్ 7.2 కోట్లు
బీహార్ 6.47 కోట్లు
తమిళనాడు 5.65 కోట్లు
ఆంధ్రప్రదేశ్ 5.01 కోట్లు
తాజావార్తలు
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..