Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Andhrapradesh Cag Report Key Points

CAG Report: కాగ్ నివేదిక… ఎన్నివేల కోట్లు మురిగిపోయాయంటే?

Published Date :March 24, 2023 , 2:10 pm
By NTV WebDesk
CAG Report: కాగ్ నివేదిక… ఎన్నివేల కోట్లు మురిగిపోయాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీకి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడైంది. 2021-22 ఆర్థిక స్థితి గతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. ఎఫ్ఆర్ బీఎం చట్టం నిర్దేశించిన పరిమితి కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు 9.85 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రెవెన్యూ ఖర్చులు 4.25 శాతం మేర పెరిగాయి. మొత్తంగా రూ. 26,380 కోట్ల ఖర్చు చేయని నిధులు మురిగిపోయాయి. నిధులు ఖర్చు పెట్టకుండా రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించి చూపేలా ప్రయత్నం జరిగింది.

సామాజిక-ఆర్ధికాభివృద్ధి పథకాల కోసం రుణాలపై ఆధారపడకుండా అదనపు రెవెన్యూ వనరుల కోసం ప్రయత్నించాలి.ఆస్తుల కల్పన-ఆర్ధికాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాలి.ఆశించిన ప్రయోజనాలు పొందేందుకు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి.హామీలు ఇచ్చేముందు సంస్థల రుణాలు తీర్చే సామర్ధ్యాన్ని లెక్కించాల్సి ఉంది.ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండానే రూ. 2812 కోట్ల ఖర్చు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్ధిక కోడ్ కు విరుద్దమైన ఈ లావాదేవీలను అనుమతించింది.

Also Read

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
  • Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
  • PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

Read Also:Australia : నెంబర్ వన్ ప్లేస్ కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన భారత్..
ఆర్ధిక సంఘం గ్రాంట్లను పంచాయితీల విద్యుత్ బకాయిల పేరుతో రూ. 1351 కోట్లు మినహాయించారు.స్థానిక సంస్థలకు చెందిన నిధుల్లో ఆర్ధిక శాఖ కోత విధించటం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉంది. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 413 కోట్ల డీఏ బకాయిలను అనుచితంగా డెబిట్ చేశారు. ఖజానా నియంత్రణను ఉల్లంఘించి సీఎఫ్ఎంఎస్ బ్యాక్ ఎండ్ ద్వారా ప్రత్యేక బిల్లులు, సర్దుబాట్లను నిలిపివేయాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ రంగ సంస్థలు 3,387 కోట్ల నష్టాల్ని చవిచూశాయి. ఏపీ డిస్కంలు గణనీయమైన నష్టాలను నమోదు చేసాయి.

Read Also:Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి

పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ చివరి రోజున.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత కాగ్ నివేదిక సభలో పెట్టారు. రూ. 1,18, 393 నిధులను అసెంబ్లీ అకౌంట్లల్లో కూడా పెట్టలేదని కాగ్ చెప్పింది.తప్పకుండా చెల్లించాల్సిన బకాయిలను పద్దుల్లో చూపలేదు.పైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ. 480 కోట్లను దారి మళ్లించింది.పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను అకౌంట్లల్లో చూపలేదు.ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులను ఖాతాల్లో చూపించకపోవడం నేరం.అవి ఏ ఖాతాల్లోకి పోతున్నాయో క్లారిటీ లేదు.నిధులని దారి మళ్లిస్తున్నారని మేం గతంలో చెబితే విమర్శించారు.. ఇప్పుడు కాగ్ అదే విషయం చెప్పింది.ఏపీలో ఆర్థిక విస్పోటం.. ఇదే విషయం కాగ్ చెప్పింది.ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించింది.ప్రభుత్వ సంస్థల రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వ ఖాతాల్లో చూపాల్సిందే.ప్రభుత్వ గ్యారెంటీలను.. అప్పులను దాచారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • advances
  • AP Discoms
  • ap govt
  • Budget Loans
  • CFMS

తాజావార్తలు

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

  • Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

  • Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే

  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions