నవ్వుల రామలింగయ్య శత జయంతి ఆరంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి)
తెలుగునాట వెండితెరపై వేయి చిత్రాలలో వెలిగిన తొలి నటుడుగా అల్లు రామలింగయ్య చరిత్ర సృష్టించారు. సదరు చిత్రాలలో వేళ్ళ మీద లెక్కపెట్ట దగ్గవాటిని పక్కకు నెడితే, అన్నిటా అల్లువారి నవ్వులే విరబూశాయి. జనం మదిలో ఇల్లు కట్టుకొని మరీ గిల్లుతూ అల్లువారు నవ్వుల పంటలు పండించారు. గిల్లిన ప్రతీసారి మళ్ళీ మొలిచే పంటలవి. అజరామరమైనవి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైనదో, అదే విధంగా ఆయన సాగిన వైనం కూడా వైవిధ్యాన్ని సంతరించుకుంది. అల్లు వారి నటన నీడన ఓ వటవృక్షమే వెలసింది. తెలుగు చిత్రసీమలో ఆ నీడనే విశాలంగా విస్తరిస్తోంది. పలువురికి అవకాశాలూ కల్పిస్తోంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ సాగారు. చదువుకొనే రోజుల్లోనే వేషాలు కట్టారు. వేదికలపై ఉపన్యాసాలూ దంచారు. యవ్వనంలో కులమతవిభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు అల్లు రామలింగయ్య. తన ముందు ఓ నిమ్నకులస్థుడిని అగ్రవర్ణాల వారు అవమానిస్తే ఉరకలు వేసే ఉడుకు నెత్తురుతో వారికి దేహశుధ్ధి చేశారు. దాంతో అరెస్ట్ అయ్యారు. తరువాత స్వరాజ్య పోరాటంలోనూ జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలోనే అల్లువారు చిత్రసీమవైపు సాగడంలో ఆలస్యం అయిందనిపిస్తుంది. ఆ రోజుల్లోనే హోమియోపతి వైద్యాన్ని అభ్యసించి, చుట్టూ ఉన్నవారికి తగిన వైద్యం చేసేవారు. అలా వైద్యం చేస్తూ, ఇష్టమైన నాటకాలు వేస్తూ సాగుతున్న అల్లు రామలింగయ్యను గరికపాటి రాజారావు తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన అనేక చిత్రాలలో హాస్యాన్ని సైతం వైవిధ్యంగా పలికిస్తూ సాగారు రామలింగయ్య. విజయవారి ‘మిస్సమ్మ’ చిత్రంలో పాత పంతులుగా అల్లువారు తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ‘మంచిమనసుకు మంచిరోజులు’లో విలనీని పండించారు. ‘నాదీ ఆడజన్మే’లో ఇద్దరు చెల్లెళ్ళ అన్నయ్యగా సెంటిమెంటూ కురిపించారు. వరైటీ రోల్స్ లో సాగుతున్నా, తన దరికి చేరిన ప్రతీ పాత్రనూ అంగీకరించారు. అది చిన్నదో పెద్దదో అని ఆలోచించకుండా వాటిలో తనదైన మార్కు ప్రదర్శించారు.
ఇక 1970లలో రూపొందిన వందలాది చిత్రాలలో అల్లు రామలింగయ్య నవ్వులు పూయిస్తూ సాగారు. ఒకే రోజున నాలుగు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నవ్వులు పండించేవారు అల్లు. అంత బిజీగా సాగుతున్న అల్లువారి కాల్ షీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు పడికాపులు కాచేవారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలలో అల్లు పండించిన నవ్వులు భావితరాల వారికి సైతం గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న హాస్యనటులుగా చరిత్రలో నిలిచారు. ఇక ఆయన కీర్తి కిరీటంలో పలు అవార్డులూ, రివార్డులూ చోటు చేసుకున్నాయి. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు.
వయసు మీద పడ్డా కుర్రాళ్ళలాగా హుషారుగా సాగిన అల్లు రామలింగయ్య, చివరి దాకా తన వద్దకు వచ్చిన పాత్రల్లో నటించి అలరించారు. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జై’ చిత్రంలో అల్లు రామలింగయ్య చివరి సారి తెరపై కనిపించారు. ఆయన తనయుడు అల్లు అరవింద్ నేడు చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్లు ఉన్న సమయంలోనే నెలకొల్పిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈ నాటికీ ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తోంది. అల్లు రామలింగయ్య చిన్నల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా జయకేతనం ఎగురవేశారు. రామలింగయ్య మనవలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ తరం టాప్ స్టార్స్ గా తమ బాణీ పలికిస్తున్నారు. ఇలా తెలుగునాట ఏ హాస్యనటుని వారసత్వమూ ఇంతలా కొనసాగలేదు. అది అల్లువారి నవ్వుల బొమ్మరిల్లుకే సాధ్యమయిందని చెప్పవచ్చు. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన పండించిన నవ్వులు ఈ నాటికీ తెలుగువారికి కితకితలు పెడుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..