దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుండి తొలి గౌరవం వందనాన్ని స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. శిక్షణ పూర్తి చేసుకున్న 208 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లు,103 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లు, నేవీ 2, కోస్ట్ గార్డ్ ఇద్దరిని ఆయన అభినందించారు.
శిక్షణ పూర్తి చేసుకొని అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్న మీ అందరికీ అభినందనలు. శిక్షణ కాలంలో ఎలాంటి స్ఫూర్తిని చూపించారో భవిష్యత్తులో నూ కొనసాగించాలి. నిరంతర విద్యార్ది గా ఉంటేనే ఎంతో నేర్చుకోగలం. విధి నిర్వాహణలో ఎన్నో సవాళ్లు ఎదురు అవుతాయి.. వాటన్నిటిని ధీటుగా ఎదుర్కోవాలన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి.
పెరుగుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తు మీరే. పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, మిలిటరీ సిస్టమ్ పై అవగాహన పెంచుకుంటూ ఉండాలన్నారు. ప్రొఫెషనలిజం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. కష్ట సమయాల్లోనూ ముందుకు వెళ్లే సామర్ధ్యం పెంచుకోవాలని క్యాడెట్లకు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సూచించారు.