AIADMK: కర్ణాటక ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పోటీ.. బీజేపీతో పొత్తుకు బీటలు?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీ చేయబోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) బెంగళూరులోని పులకేశినగర్ స్థానంలో మిత్రపక్షమైన బిజెపికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టింది. అన్నాడీఎంకే తన అభ్యర్థిగా డి అన్బరాసన్ను ఎంపిక చేసింది. రిజర్వ్డ్ స్థానానికి మురళిని ఎంపిక చేసినట్లు బీజేపీ గతంలో ప్రకటించింది. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: US Maine Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి
గత కొన్ని నెలలుగా ఇరుపక్షాల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలకు దారితీసిన బీజేపీతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఏఐఏడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జే జయలలిత సహాయకురాలు వీకే శశికళతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై అన్నాడీఎంకే కూడా అసంతృప్తిగా ఉంది. అవినీతి కేసులో శిక్ష పడి జైలులో ఉన్నప్పుడు శశికళను అన్నాడీఎంకే బహిష్కరించింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేత్ర కజగంతో పొత్తు కోసం బీజేపీ కూడా ముందుకు వచ్చింది.
Also Read:Johnny Nellore: కేరళ కాంగ్రెస్కు జానీ నెల్లూరు రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం!
Also Read
దివంగత మాజీ సీఎం జయలలిత, బిజెపి నేతలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, బిజెపితో ఎన్నికల పొత్తులను చాలా వరకు దూరంగా ఉన్నారు. కానీ ఆమె మరణం తరువాత, ఈపీఎస్, ఓపీఎస్ లతో కూడిన పార్టీ నాయకత్వం పన్నీర్ సెల్వం సూచించినట్లు బీజేపీతో పొత్తుకు అంగీకరించింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఎన్నికల్లో మూడు ఎన్నికల పరాజయాలను చవిచూసింది. ఇటీవలి ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా ఏఐఏడీఎంకే నాయకులు తమ బీజేపీ ప్రత్యర్ధులతో ప్రచారానికి దూరంగా ఉండటంతో కూటమిలో ఒత్తిడి కనిపించింది. చివరకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్-డీఎంకే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు.
తాజావార్తలు
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!