AIADMK: కర్ణాటక ఎన్నికల్లో ఏఐఏడీఎంకే పోటీ.. బీజేపీతో పొత్తుకు బీటలు?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీ చేయబోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) బెంగళూరులోని పులకేశినగర్ స్థానంలో మిత్రపక్షమైన బిజెపికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టింది. అన్నాడీఎంకే తన అభ్యర్థిగా డి అన్బరాసన్ను ఎంపిక చేసింది. రిజర్వ్డ్ స్థానానికి మురళిని ఎంపిక చేసినట్లు బీజేపీ గతంలో ప్రకటించింది. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: US Maine Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి
గత కొన్ని నెలలుగా ఇరుపక్షాల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలకు దారితీసిన బీజేపీతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఏఐఏడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జే జయలలిత సహాయకురాలు వీకే శశికళతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై అన్నాడీఎంకే కూడా అసంతృప్తిగా ఉంది. అవినీతి కేసులో శిక్ష పడి జైలులో ఉన్నప్పుడు శశికళను అన్నాడీఎంకే బహిష్కరించింది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేత్ర కజగంతో పొత్తు కోసం బీజేపీ కూడా ముందుకు వచ్చింది.
Also Read:Johnny Nellore: కేరళ కాంగ్రెస్కు జానీ నెల్లూరు రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం!
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
దివంగత మాజీ సీఎం జయలలిత, బిజెపి నేతలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, బిజెపితో ఎన్నికల పొత్తులను చాలా వరకు దూరంగా ఉన్నారు. కానీ ఆమె మరణం తరువాత, ఈపీఎస్, ఓపీఎస్ లతో కూడిన పార్టీ నాయకత్వం పన్నీర్ సెల్వం సూచించినట్లు బీజేపీతో పొత్తుకు అంగీకరించింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఎన్నికల్లో మూడు ఎన్నికల పరాజయాలను చవిచూసింది. ఇటీవలి ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా ఏఐఏడీఎంకే నాయకులు తమ బీజేపీ ప్రత్యర్ధులతో ప్రచారానికి దూరంగా ఉండటంతో కూటమిలో ఒత్తిడి కనిపించింది. చివరకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్-డీఎంకే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!