40 ఏళ్ల ‘అమావాస్య చంద్రుడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 29తో ‘అమావాస్య చంద్రుడు’కు 40 ఏళ్ళు)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన నూరవ చిత్రం ‘రాజా పార్వై’. నిర్మాతగా కమల్ కు ఇదే తొలి చిత్రం. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ పేరుతో అనువదించారు. తమిళ చిత్రం 1981 ఏప్రిల్ 10న విడుదల కాగా, తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ ఆగస్టు 29న జనం ముందు నిలచింది. కమల్ హాసన్ ఆయన అన్నలు చారుహాసన్, చంద్రహాసన్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అందువల్ల తమ బ్యానర్ కు ‘హాసన్ బ్రదర్స్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా బాణీల్లో ‘అమావాస్య చంద్రుడు’ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే కమల్ హాసన్ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా సక్సెస్ సాధించిందేమీ లేదు. అయితే నటునిగా కమల్ కు తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించి పెట్టింది. వైవిధ్యం కోసం తపించే కమల్ ఈ సినిమా టైటిల్స్ ను వరైటీగా ప్లాన్ చేశారు. ‘ఈ చిత్రాన్ని సృష్టించిన వారు’ – అంటూ టైటిల్స్ స్క్రోల్ కావడం ఆ రోజుల్లో విశేషంగా చర్చించుకున్నారు.
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
కథ విషయానికి వస్తే – రఘు అందగాడు. అయితే తన రూపాన్నే చూసుకోలేని విధంగా అతను పుట్టుకతో అంధుడు. ఓ సందర్భంలో నాన్సీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. రఘులోని మంచితనం, అతనిలోని కళాకారుడు నాన్సీని ఆకర్షిస్తారు. అతణ్ణి ఎంతగానో అభిమానిస్తుంది. ఆ అభిమానం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. నాన్సీ క్రిస్టియన్ కావడంతో ఆమె తండ్రి వారి వివాహానికి అంగీకరించడు. చివరకు నాన్సీ నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ నాన్సీని రఘుతో లేచిపోయేలా చేస్తారు. కథ ఇంతే అయినా, దీనిని సింగీతం తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్, మాధవి, కాంతారావు, చారుహాసన్, చంద్రహాసన్, కాంతారావు, లలిత, వై.జి.మహేంద్రన్, ఢిల్లీ గణేశ్, వి.కె.రామస్వామి, రాజాలక్ష్మి పార్థసారథి, నిర్మలమ్మ, రాధాకుమారి నటించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు, ప్రసాద్ సంస్థల అధినేత ఎల్.వి.ప్రసాద్ ఈ చిత్రంలో హీరోయిన్ తాతగా నటించారు. ఈ చిత్రానికి ఆత్రేయ, రాజశ్రీ రచన చేయగా, వేటూరి పాటలు రాశారు. తమిళంలో వైరముత్తు రాసిన “అంది మళై పొళికిరదు…” పాటను తెలుగులో “సుందరమో సుమధురమో…” అంటూ మనోహరంగా పలికించారు వేటూరి సుందర రామ్మూర్తి. అంతకు ముందు ఇళయరాజా బాణీలకు వేటూరి కొన్ని సినిమాల్లో రాసినా, ఈ పాట విన్న తరువాత “ఒరిజినల్ కంటే బాగుందని” కితాబు నిచ్చారు ఇళయరాజా. ఆ తరువాత నుంచీ ఇళయరాజా, వేటూరి కలయికలో అనేక సూపర్ హిట్ మ్యూజికల్స్ తెలుగువారిని అలరించడం అందరికీ తెలిసిందే! ఇప్పటికీ ‘అమావాస్య చంద్రుడు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పాట – “సుందరమో సుమధురమో…” అన్నదే.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!