40 ఏళ్ల ‘అమావాస్య చంద్రుడు’
(ఆగస్టు 29తో ‘అమావాస్య చంద్రుడు’కు 40 ఏళ్ళు)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన నూరవ చిత్రం ‘రాజా పార్వై’. నిర్మాతగా కమల్ కు ఇదే తొలి చిత్రం. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ పేరుతో అనువదించారు. తమిళ చిత్రం 1981 ఏప్రిల్ 10న విడుదల కాగా, తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ ఆగస్టు 29న జనం ముందు నిలచింది. కమల్ హాసన్ ఆయన అన్నలు చారుహాసన్, చంద్రహాసన్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అందువల్ల తమ బ్యానర్ కు ‘హాసన్ బ్రదర్స్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా బాణీల్లో ‘అమావాస్య చంద్రుడు’ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే కమల్ హాసన్ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా సక్సెస్ సాధించిందేమీ లేదు. అయితే నటునిగా కమల్ కు తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించి పెట్టింది. వైవిధ్యం కోసం తపించే కమల్ ఈ సినిమా టైటిల్స్ ను వరైటీగా ప్లాన్ చేశారు. ‘ఈ చిత్రాన్ని సృష్టించిన వారు’ – అంటూ టైటిల్స్ స్క్రోల్ కావడం ఆ రోజుల్లో విశేషంగా చర్చించుకున్నారు.
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
కథ విషయానికి వస్తే – రఘు అందగాడు. అయితే తన రూపాన్నే చూసుకోలేని విధంగా అతను పుట్టుకతో అంధుడు. ఓ సందర్భంలో నాన్సీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. రఘులోని మంచితనం, అతనిలోని కళాకారుడు నాన్సీని ఆకర్షిస్తారు. అతణ్ణి ఎంతగానో అభిమానిస్తుంది. ఆ అభిమానం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. నాన్సీ క్రిస్టియన్ కావడంతో ఆమె తండ్రి వారి వివాహానికి అంగీకరించడు. చివరకు నాన్సీ నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ నాన్సీని రఘుతో లేచిపోయేలా చేస్తారు. కథ ఇంతే అయినా, దీనిని సింగీతం తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్, మాధవి, కాంతారావు, చారుహాసన్, చంద్రహాసన్, కాంతారావు, లలిత, వై.జి.మహేంద్రన్, ఢిల్లీ గణేశ్, వి.కె.రామస్వామి, రాజాలక్ష్మి పార్థసారథి, నిర్మలమ్మ, రాధాకుమారి నటించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు, ప్రసాద్ సంస్థల అధినేత ఎల్.వి.ప్రసాద్ ఈ చిత్రంలో హీరోయిన్ తాతగా నటించారు. ఈ చిత్రానికి ఆత్రేయ, రాజశ్రీ రచన చేయగా, వేటూరి పాటలు రాశారు. తమిళంలో వైరముత్తు రాసిన “అంది మళై పొళికిరదు…” పాటను తెలుగులో “సుందరమో సుమధురమో…” అంటూ మనోహరంగా పలికించారు వేటూరి సుందర రామ్మూర్తి. అంతకు ముందు ఇళయరాజా బాణీలకు వేటూరి కొన్ని సినిమాల్లో రాసినా, ఈ పాట విన్న తరువాత “ఒరిజినల్ కంటే బాగుందని” కితాబు నిచ్చారు ఇళయరాజా. ఆ తరువాత నుంచీ ఇళయరాజా, వేటూరి కలయికలో అనేక సూపర్ హిట్ మ్యూజికల్స్ తెలుగువారిని అలరించడం అందరికీ తెలిసిందే! ఇప్పటికీ ‘అమావాస్య చంద్రుడు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పాట – “సుందరమో సుమధురమో…” అన్నదే.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!