మసీదుపై ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది.. కుందుజ్లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
మా ప్రాథమిక పరిశోధనలో ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నామని కుందుజ్లో సంస్కృతి మరియు సమాచార డైరెక్టర్ మతియుల్లా రోహాని ప్రకటించారు.. ఆగష్టు చివరల్లో యూఎస్ మరియు నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. అప్పటి నుంచి డజన్ల కొద్దీ మరణాల సంభవిస్తూనే ఉన్నా.. ఇవాళ జరిగిన మారణహోమమే అతిపెద్దదిగా చెబుతున్నారు. మసీదు లోపల శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, మృతదేహాలు, బాధితుల ఆర్థనాధాలతో కుందుజ్ ప్రావిన్షియల్ హాస్పిటల్కు భయంకర పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!