చెదరని దశాబ్దాల స్నేహబంధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- రష్యా మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు కలిసి నడుస్తున్నాయి. అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో మనకు రష్యా అండదండలు ఎనలేనివి. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో భారత్ తటస్థ వైకరి అవలంభించినప్పటికీ సోవియట్ యూనియన్తో సన్నిహితంగా ఉంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి.
సోవియట్ విచ్ఛిన్నం తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. దాంతో పాటే ఏకదృవ ప్రంపంచం ఏర్పడింది. వరల్డ్ ఓ గ్లోబల్ విలేజ్గా మారింది. మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రపంచ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో పాటే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో భారత్ విదేశీ విధానం కొంత మేర మారక తప్పలేదు.
Also Read
మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ విధానాల నుంచి కొంచెం పక్కకు తప్పుకుంటున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడింది. భారత్, రష్యాలు ఇందుకు మినహాయింపు కాదు. దాంతో, ఇరు దేశాల మైత్రీ బంధంలో కొంత దూరం ఏర్పడిన భావన ఏర్పడింది.
ఇటీవల కాలంలో చైనాతో రష్యా మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఇదే సమయంలో భారత్కు అమెరికా దగ్గరైంది. ఇండో-–పసిఫిక్ప్రాంతం విషయంలో అమెరికా బాటలో ఇండియా నడుస్తోందని రష్యా అనుకుంటోంది. అలాగే చైనా చెప్పినట్టు రష్యా నడుచుకుంటుందన్నది భారత్ అనుమానం. దాంతో రెండు దేశాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందనిపించింది. ఐతే, పుతిన్ తాజా పర్యటనతో అన్ని అనుమానాలు తొలగిపోయాయి.
మరోవైపు , ఇరాన్ విషయంలో భారత్ వైకరి మారింది. గతంలో మన చముర అవసరాలలో 10 శాతం ఇరాన్ నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. ఇది భారత్ తనకు తాను తీసుకున్న నిర్ణయం కాదు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి అలా చేయాల్సి వచ్చింది. భారత్ దూరమైన తరువాత ఇరాన్కు రష్యా దగ్గరైంది. ఐతే, ఇరాన్ మాదిరిగా రష్యా విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ లొంగలేదు. రష్యా నుంచి కాకుండా తమ నుంచి రక్షణ పరికరాలు కొనాలని అగ్రరాజ్యం ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదు. 2018లో ఇండియా -రష్యా మధ్య కుదిరిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్సిస్టం కొనుగోలు ఒప్పందానికే కట్టుబడి ఉంది.
కోవిడ్ వేళ పుతిన్ పూర్తిగా రష్యాకే పరిమితమయ్యారు. ఈ రెండేళ్లలో ఆయన రెండే రెండు సార్లు కాలు బయటపెట్టారు. మొదటిసారి, ఈ జూన్లో జెనీవాలో బైడన్తో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడు భారత్ పర్యటన. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలకు ఇది తాజా ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితులో పుతిన్ భారత పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
పుతిన్ పర్యటనలో భాగంగా ఉభయ దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. సైబర్ సెక్యూరిటీ నుంచి రైఫిల్స్ తయారీ వరకు మొత్తం 28 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. పదేళ్ల పాటు కొనసాగే మిలటరీ సాంకేతిక సహకార ఒప్పందం వీటిలో కీలకమైంది. ఉత్తరప్రదేశ్లో ఏకే 203 అసల్ట్ రైఫిల్స్ తయారీకి కూడా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆరు లక్షల రైఫిల్స్ తయారవుతాయి. ఇండియన్ ఆర్మీకి రక్షణ విడి భాగాలు అందించేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్భారత్లో ఉన్నది కొన్ని గంటలే కావచ్చు, కానీ చర్చలు గొప్పగా ముగిసాయని చెప్పాలి. అందుకు ఈ ఒప్పందాలే ఉదాహరణ.
మరోవైపు, 1971 నాటి శాంతి సహకార ఒప్పందానికి ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ అర్థ శతాబ్ద కాలంలో ప్రపంచం ఎంత మారినా భారత్-రష్యా మైత్రీ బంధం మారలేదని పుతిన్ పర్యటన చెప్పకనే చెప్పింది!
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!