సౌదీ ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్లో ఆర్కే పివిఆర్లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్స్ మహమ్మద్ మొరాని తెలిపారు. డోమ్ ఎంటర్టైన్మెంట్, కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి లఘు చిత్రాలను వీక్షించి ఆనందించారు.
మహమ్మద్ మొరానీ, లక్కీ మొరానీ, మజర్ నదియాడ్వాలా, అలీమ్ మొరానీ వంటి వారు అతిథుల్ని ఘనంగా స్వాగతించారు. సౌదీ ఫిల్మ్ నైట్స్ – సౌదీ సినిమా కళాత్మక నైపుణ్యతను హైలైట్ చేస్తూ సౌదీ అరేబియా, భారతదేశం మధ్య సాంస్కృతిక బంధాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సౌదీ చలనచిత్ర నిర్మాణం, వారి నైపుణ్యతను అందరికీ తెలియజేశారు. సౌదీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య సినిమా సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, రెండు దేశాల మధ్య భవిష్యత్తులో సహకారానికి మార్గం సుగమం చేసేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.