సౌదీ ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్లో ఆర్కే పివిఆర్లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్స్ మహమ్మద్ మొరాని తెలిపారు. డోమ్ ఎంటర్టైన్మెంట్, కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి లఘు చిత్రాలను వీక్షించి ఆనందించారు. మహమ్మద్ మొరానీ, లక్కీ మొరానీ, మజర్ నదియాడ్వాలా,…