జైభీమ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది.కమర్షియల్ ఫార్మాట్తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టు కుంటుంది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు దక్కిం చుకున్న మొదటి తమిళ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం పై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించి ప్రశసించాడు. ఏది ఏమైనా ఈ చిత్రం టాప్250 చిత్రాల సరసన చోటు దక్కించుకోవడం మాములు విష యం కాదని వేరే చెప్పనక్కర లేదు. కేవలం మౌత్ పబ్లిసీటీతోనే ఈ చిత్రం ఎక్కడికో వెళ్లిపోయింది. తమిళనాడులో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా.. తెరకెక్కింది జై భీమ్ చిత్రం. అమెజాన్ ప్రైమ్ లో 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి సినిమా పేరు.. మారు మోగి పోతుంది. తాజాగా ఐఎండీబీ 250 చిత్రాల జాబితాలోకి చేరిపో యింది. ఐఎండీబీ రేటింగ్స్ లో జై భీమ్ సినిమా 8.1 రేటింగ్తో నిలి చింది. ఇప్పటి వరకూ ఏ తమిళ సిని మాకు ఇంతలా రేటింగ్స్ రాలేదు. మెుదట 9.6 రేటింగ్ తో టాప్ వన్ లో ఉంది. కొన్ని గంటల తర్వాత 180వ స్థానానికి చేరుకుంది. ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ వల్ల ఈ హెచ్చుతగ్గులు మారుతూ ఉంటాయి.
ది శశాంక్ రిడెంప్షన్ ఆఫ్ ఫ్రాంక్ డారాబాంట్, గాడ్ ఫాదర్, డార్క్ నైట్, 12 యాంగ్రీ మెన్ మొదలైన చిత్రాలు ఐఎండీబీ 250 చిత్రాల టాప్ లో ఉన్నాయి. మొత్తం 250 చిత్రాల జాబితాలో ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, లగాన్, దంగల్, పల్ప్ ఫిక్షన్, అన్ఫర్గివెన్ లాంటి చిత్రాలు మాత్రమే ఐఎండీబీ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు జై భీమ్ సినిమాకు ఆ ఘనత దక్కింది. ఐఎండీబీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్లను బట్టి మాత్రమే ర్యాంక్ ఇస్తుంది.
1995 సంవత్సరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. పోలీసుల కర్కశత్వాన్ని చూపిస్తూ.. బాధితురాలి తరఫున పైసా తీసుకోకుండా న్యాయవాది చంద్రు ఎలా కేసును గెలి పించాడనేది ఈ చిత్రంలో చూడొచ్చు. టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించారు. సినిమా చూసిన తర్వాత ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.