చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షోకే మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.. వంద కోట్లకు పైగా eఈ సినిమా వసూల్ చేసింది..
కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ తేజ సజ్జా మూవీ కు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈజీగా రూ.150 కోట్లకు పైగా రాబట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ రైట్స్ కలిపి దాదాపు 30 కోట్లకు జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది..
సినిమా విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా హనుమాన్ నిర్మాతలు జీ5తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. దీని ప్రకారం ఫిబ్రవరి మూడో వారంలో హనుమాన్ ను స్ట్రీమింగ్ చేయాలని భావించారట.. అయితే ఓటీటీలో రిలీజ్ డేట్ లో మార్పులు కావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.. జీ 5 స్ట్రీమింగ్ డేట్ ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. మరో రెండు నెలల తర్వాతే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ చేయాలని జీ5 సంస్థను నిర్మాతలు కోరారట. అంటే మార్చి ఆఖరి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండనుందని టాక్..