ఆలోచించడం నేర్చిన సాయిచంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 25న సాయిచంద్ పుట్టినరోజు)
నటుడు సాయిచంద్ ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో ‘మాభూమి’ వంటి సంచలనాత్మక చిత్రంలో ప్రధాన భూమిక పోషించి మెప్పించారు. ఆ తరువాత ‘మంచు పల్లకి’లో చిరంజీవి స్నేహితునిగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలూ పోషించారు. బాపు ‘పెళ్ళీడు పిల్లలు’లో ఓ హీరోగా నటించారు. ‘ఈ చదువులు మాకొద్దు’లోనూ కీలక పాత్ర ధరించారు. ఎందుకనో సాయిచంద్ పరుగెత్తి పాలుతాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు అనుకున్నట్టున్నారు. తన దరికి చేరిన పాత్రలనే ఎంచుకున్నారు కానీ, ఏ రోజునా పాత్రల కోసం పాదరక్షలు అరిగేలా తిరిగింది లేదు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లో అమలకు అన్నయ్యగా నటించారు. ‘అంకురం’లోనూ ముఖ్యపాత్ర ధరించారు. ఆ తరువాత ఎందుకనో సాయిచంద్ వైపు ఎవరూ చూడలేదు. ఆయన కూడా తనకు పాత్రలు ఇవ్వండి అంటూ ఎవరినీ అడగలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత శేఖర్ కమ్ముల తన ‘ఫిదా’లో హీరోయిన్ తండ్రి పాత్రకు సాయిచంద్ ను ఎంచుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో మళ్ళీ సినిమా జనం సాయిచంద్ వైపు చూడడం మొదలెట్టారు.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
‘ఫిదా’ తరువాత చిరంజీవి తొలి చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’లోనూ, ‘ఉప్పెన’లోనూ గుర్తింపు ఉన్న పాత్రలే పోషించారు సాయిచంద్. ‘చెక్’లో కూడా సాయిచంద్ కనిపించారు. రానా ‘విరాట పర్వం’లో ఓ కీలక పాత్ర ధరించారు. నటునిగా సాయిచంద్ పరిధి చిన్నగానే కనిపించినా, అందులో ఆయన ధరించిన వైవిధ్యమైన పాత్రలు మాత్రం చిన్నవేమీ కావు.
తెలుగునేలను చైతన్యవంతంగా మార్చిన మహనీయుల్లో ఒకరిగా నిలచిన త్రిపురనేని రామస్వామి మనవడు సాయిచంద్. త్రిపురనేని గోపీచంద్ తనయుడు. గోపీచంద్ రచయితగా ఎంతో పేరున్నవారు. చిత్రసీమలోనూ ఆయన దర్శకునిగానూ రాణించారు. గోపీచంద్ కు ఆయన తండ్రి రామస్వామి ‘ప్రశ్నించడం’ నేర్పారు. కానీ, సాయిచంద్ తన తండ్రి గోపీచంద్ నుండి ‘ఆలోచించడం’ అభ్యసించినట్టు ఉంది. అందుకే కాబోలు, ఆయనతో ఓ సారి మాట్లాడితే చాలు ఎంతో కొంత జ్ఞానం లభిస్తుందని అంటారు. ఇప్పటికీ అవివాహితునిగానే ఉంటున్న సాయిచంద్, తనకు ‘ఫిదా’ సినిమా ద్వారా సాయి పల్లవి వంటి కూతురు లభించిందని సంతోషిస్తారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!