21 ఏళ్ళు పూర్తి చేసుకున్న తేజ “చిత్రం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “చిత్రం” నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతోనే ఆయన ఉదయ్ కిరణ్, రీమాసేన్ లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో తేజ చేసిన ప్రయత్నం సక్సెస్ ఫుల్ అయ్యింది.
ఒక మధ్య తరగతి యువకుడు, ఆధునిక భావాలున్న యువతి ప్రేమలో పడతారు. కాలేజీలో చదువుతుండగానే హీరోయిన్ గర్భవతి అవుతుంది. కానీ ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమె ఒప్పుకోదు. దీంతో హీరోహీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత బిడ్డ పుట్టడంతో… పసిపాపతోనే కాలేజీకి హాజరవుతారు ఆ జంట. మరోవైపు హీరోకు చదువుకుంటూ వారిని పోషించడం కష్టంగా మారుతుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ ను హీరో విసుక్కోవడంతో… ఆమె బిడ్డను అక్కడే వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది ? వాళ్ళు ఎలా కలుసుకున్నారు ? అనే విషయాలను తేజ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తుంటే ఆ పరిస్థితులను డైరెక్టుగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చదువుకునే రోజుల్లోనే ఆలోచన లేకుండా తొందరపడి ప్రేమ, పెళ్ళి అంటే… తరువాత ఆ ప్రేమికులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలను తేజ కళ్ళకు కట్టినట్టు చక్కగా చూపించారు.
Also Read
ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. “ఢిల్లీనుండి గల్లీదాక, మావో మావో, ఏకాంత వేళ ఈ కాంత సేవ, చీమలు దూరని, ఊహల పల్లకిలో, కుక్క కావాలి” సాంగ్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదల కాగా… ఆ సమయంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా “ఢిల్లీనుండి గల్లీదాక, మావో మావో సాంగ్స్” బాగా విన్పించేవి.
ఈ చిత్రం అందరికీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది. తేజకు, ఉదయ్ కిరణ్, రీమా సేన్ కు “చిత్రం” వారి కెరీర్ లో మరిచిపోలేని హిట్ ను ఇచ్చింది. ఆ తరువాత ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన మన మధ్య లేకపోయినా… తన సినిమాల ద్వారా ఎప్పటికీ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటారు. హీరోయిన్ రీమా సేన్ కూడా ఆ తరువాత పలువురు స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. దర్శకుడు తేజ లైట్ అసిస్టెంట్ నుంచి సినిమాటోగ్రాఫర్ గా, స్క్రీన్ రైటర్ గా… ఆ తరువాత దర్శకుడిగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన “చిత్రం” చిత్రానికి సీక్వెల్ గా “చిత్రం 1.1″ను రూపొందించే పనిలో ఉన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!