Zero Shadow day: మీరు చూశారా.. హైదరాబాద్లో నీడ మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zero Shadow day: ఇవాల హైదరాబాద్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటలకు ‘జీరో షాడో డే’ అనే ఛాయ కనిపించలేదు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ ఖగోళ అద్భుతానికి ఈసారి హైదరాబాద్ నగరం వేదికైంది. ఎప్పుడూ మనల్ని వెంటాడే నీడకు దూరంగా ఉండే అరుదైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మనకు మాత్రమే దక్కింది. సూర్యకిరణాలు నిటారుగా 90 డిగ్రీల కోణం ఉంచిన ఏ వస్తువు యొక్క నీడ రెండు నిమిషాలు అంటే 12:12 నుండి 12:14 వరకు కనిపించలేదు. ఎండలో నిలబడినా మన నీడ కనిపించలేదు. కమాన్.. సెలబ్రేట్ చూసుకోండి.. జీరో షాడో డే.. అంటూ హైదరాబాదీలు ఎంజాయ్ చేశారు. సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు హైదరాబాద్ నగరాన్ని సూర్యకిరణాలు తాకాయి. మన హైదరాబాదీలకు ఇదో అరుదైన అనుభవం. ఇలా మాయమైన నీడ.. రెండు నిమిషాల తర్వాత మళ్లీ ప్రత్యక్షమైంది.
ఇక అదే విధంగా ఆగస్టు 3న హైదరాబాద్లో జీరో షాడో డే ను కూడా నిర్వహిస్తామని వివరించారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో దాదాపు అన్ని ప్రాంతాల్లో నీడ కనుమరుగవుతుందన్నారు. ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.17 గంటలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడలు రెండు నిమిషాల పాటు మాయమయ్యాయి.
Also Read
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
జీరో షాడో డే అంటే?
ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వివరాల ప్రకారం… జీరో షాడో సమయంలో ఏ వస్తువుపైనా, మనిషిపైనా నీడ కనిపించదు. దీనిని సాంకేతిక పరిభాషలో జెనిత్ పొజిషన్ అంటారు. ఈ కారణంతోనే జీరో షాడో డే జరుగుతుంది. ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని వెల్లడైంది. ఇది కర్కాటక రాశి, మకరరాశి మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. జీరో షాడో సమయంలో సూర్యుని అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యుని కాంతి మనిషి పరిధిదాటి పోలేదు. అందుకే నీడ పడదు.
ఎందుకు జరుగుతుంది..?
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, దాని భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ క్రమంలో మన వాతావరణం మారిపోతోంది. అంటే… వెలుతురు తీవ్రతలో మార్పు వస్తుంది. ఎండ కాయ మధ్యలోకి వచ్చింది..అందుకే ఎండలు మండిపోతున్నాయని అనుకుంటున్నాం. కానీ… సూర్యుడు నట్ట నడి నెత్తికి రెండు సార్లు మాత్రమే తగులతాడు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో మరోసారి జరుగుతాయి. అప్పుడే సూర్యుడు సరిగ్గా మధ్యలోకి వస్తాడు. దీనిని అత్యున్నత స్థానం అంటారు. సాంకేతికంగా చెప్పాలంటే, సూర్యుడు మకరం మరియు కర్కాటకం మధ్య +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ దృగ్విషయం జరుగుతుంది. సరిగ్గా కేంద్రీకృతమై ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అందుకే మన నీడ కనిపించదు.
Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!