Zero Shadow day: మీరు చూశారా.. హైదరాబాద్లో నీడ మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zero Shadow day: ఇవాల హైదరాబాద్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటలకు ‘జీరో షాడో డే’ అనే ఛాయ కనిపించలేదు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ ఖగోళ అద్భుతానికి ఈసారి హైదరాబాద్ నగరం వేదికైంది. ఎప్పుడూ మనల్ని వెంటాడే నీడకు దూరంగా ఉండే అరుదైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మనకు మాత్రమే దక్కింది. సూర్యకిరణాలు నిటారుగా 90 డిగ్రీల కోణం ఉంచిన ఏ వస్తువు యొక్క నీడ రెండు నిమిషాలు అంటే 12:12 నుండి 12:14 వరకు కనిపించలేదు. ఎండలో నిలబడినా మన నీడ కనిపించలేదు. కమాన్.. సెలబ్రేట్ చూసుకోండి.. జీరో షాడో డే.. అంటూ హైదరాబాదీలు ఎంజాయ్ చేశారు. సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు హైదరాబాద్ నగరాన్ని సూర్యకిరణాలు తాకాయి. మన హైదరాబాదీలకు ఇదో అరుదైన అనుభవం. ఇలా మాయమైన నీడ.. రెండు నిమిషాల తర్వాత మళ్లీ ప్రత్యక్షమైంది.
ఇక అదే విధంగా ఆగస్టు 3న హైదరాబాద్లో జీరో షాడో డే ను కూడా నిర్వహిస్తామని వివరించారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో దాదాపు అన్ని ప్రాంతాల్లో నీడ కనుమరుగవుతుందన్నారు. ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.17 గంటలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడలు రెండు నిమిషాల పాటు మాయమయ్యాయి.
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
జీరో షాడో డే అంటే?
ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వివరాల ప్రకారం… జీరో షాడో సమయంలో ఏ వస్తువుపైనా, మనిషిపైనా నీడ కనిపించదు. దీనిని సాంకేతిక పరిభాషలో జెనిత్ పొజిషన్ అంటారు. ఈ కారణంతోనే జీరో షాడో డే జరుగుతుంది. ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని వెల్లడైంది. ఇది కర్కాటక రాశి, మకరరాశి మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. జీరో షాడో సమయంలో సూర్యుని అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యుని కాంతి మనిషి పరిధిదాటి పోలేదు. అందుకే నీడ పడదు.
ఎందుకు జరుగుతుంది..?
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, దాని భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఈ క్రమంలో మన వాతావరణం మారిపోతోంది. అంటే… వెలుతురు తీవ్రతలో మార్పు వస్తుంది. ఎండ కాయ మధ్యలోకి వచ్చింది..అందుకే ఎండలు మండిపోతున్నాయని అనుకుంటున్నాం. కానీ… సూర్యుడు నట్ట నడి నెత్తికి రెండు సార్లు మాత్రమే తగులతాడు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో మరోసారి జరుగుతాయి. అప్పుడే సూర్యుడు సరిగ్గా మధ్యలోకి వస్తాడు. దీనిని అత్యున్నత స్థానం అంటారు. సాంకేతికంగా చెప్పాలంటే, సూర్యుడు మకరం మరియు కర్కాటకం మధ్య +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ దృగ్విషయం జరుగుతుంది. సరిగ్గా కేంద్రీకృతమై ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అందుకే మన నీడ కనిపించదు.
Revanth Reddy: అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు..!
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!