కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని షర్మిల విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దళితులకు రూ.10 లక్షలు కాదు, రూ.50 లక్షలు ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల చోప్పున నిరుద్యోగ బృతి ఇవ్వాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రతి మంగళవారం రోజును నిరుద్యోగ నిరసన రోజుగా వైఎస్ఆర్ టీపీ ప్రకటించింది.
Read: లైవ్ : కర్ణాటక కొత్త సీఎం ఈయనే…!