తొలిసారి మీడియా ముందుకు వైఎస్ షర్మిల..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు.. పార్టీ జెండా, పేరు, అజెండా ప్రకటించిన తర్వాత ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. రేపు లొటస్పాండ్లో మీడియాతో మాట్లాడనున్నారు షర్మిల.. రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పరిశీలకులను కూడా ప్రకటించనున్నారు.. మెంబర్ షిప్ డ్రైవ్, అక్టోబర్ లో పాదయాత్ర పై ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి.. పలు అంశాలపై స్పందిస్తున్న షర్మిల… ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వస్తున్నారు.. ధర్నాలు, దీక్షలకు కూడా దిగారు.. ఇక, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత.. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టిసారించారు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.
Also Read
- Tags
- telangana
- YS Sharmila
- YSRTP
తాజావార్తలు
-
AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్ఏషియా భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్.!
-
US: ఖతార్లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!