Extramarital Affair: దారుణం.. ఆపనికి అడ్డుగా ఉందని కూతుర్ని హత్య చేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎలాంటి లోటు లేకుండా అల్లారముద్దుగా పెంచుకుంటారు. తమ కోరికలు, ఇష్టాలను చంపుకొని మరీ.. పిల్లల అలనాపాలనా చూసుకుంటారు. కానీ.. ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నీచానికి పాల్పడింది. కేవలం ‘కామలీలల’ కోసం కన్నకూతురినే తన చేతులతో చంపింది. ఆపై.. తాను చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, సరికొత్త డ్రామాకు తెరతీసి, తనకేమీ తెలియదన్నట్టుగా ‘మహానటి’ని మించి నటించింది. చివరికి తాను చేసిన పాపానికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
Read also: Heavy Rains: విషాదాన్ని మిగులుస్తున్న వర్షాలు.. దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి
Also Read
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
కుషాయిగూడలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో సంచలనం వెలుగులోకి వచ్చింది. బాలికను తల్లి కల్యాణే హత్య చేసినట్లు తేలింది. తండ్రి అనుమానం నిజమైంది. నిందితురాలికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, దానిని తన కూతురు అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న నాలుగున్నరేళ్ల బాలికను దిండుతో కప్పి ఊపిరాడకుండా చేసి తన్విత హత్య చేసింది. పోలీసుల విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. ఈ నెల 1వ తేదీ (శనివారం) మధ్యాహ్నం తన్విత స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు ఆడుకుని పడుకుంది. కూరగాయల మార్కెట్లో పనిచేసే తల్లి కళ్యాణి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు నిద్రిస్తోంది. ఫోన్ చేసినా నిద్ర లేవకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిద్రిస్తున్న కూతురు నిద్రలోనే మృతి చెందిందని కల్యాణి కన్నీరుమున్నీరైంది. ఆమె తన పొరుగువారిని, బంధువులను తెలిపింది. అయితే కూతురు మృతి పట్ల భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త రమేష్ జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read also: Secunderabad: సికింద్రాబాద్లో భారీ చోరీ.. రూ.5 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్
ఊపిరాడక చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు చిన్నారి తల్లి కళ్యాణిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన కూతురిని తానే హత్య చేసినట్లు అంగీకరించింది. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్ వెనుక వీధిలో నివాసముంటున్న నాయిక్వాడి రమేష్ కుమార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కల్యాణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు తన్విత (4 సంవత్సరాల 6 నెలలు) అనే కుమార్తె ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2021 నుంచి విడివిడిగా ఉంటున్నారు.కళ్యాణి కూతురిని తీసుకుని కుషాయిగూడలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. పాప స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. భర్త నుంచి విడిపోయిన కళ్యాణికి స్థానికంగా ఉన్న మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పాప అడ్డుగా ఉందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టింది. చిన్నారిని ఊపిరాడకుండా చేసి, నిద్రలోనే చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పాలివ్వాల్సిన తల్లి నిద్రపోతే చంపేస్తుందని ఆ చిన్నారి ఎలా ఊహించగలదు.
Asia Cup 2023 Schedule: ఆసియా కప్కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్ సిగ్నల్.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!