Yadadri: ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి.. ఆమెకు ఇంతకు ముందే పెళ్లైదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri: అందమైన జీవితం, ఆభరణాల వంటి పిల్లలు, భార్యాభర్తల మధ్య లోతైన అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధమే. అక్రమ సంబంధం వైవాహిక ఆనందాన్ని పాడు చేస్తుంది. ఇది అన్ని వస్తువులను ఆకుపచ్చగా మారుస్తుంది. భాగస్వామిలో ఎవరికైనా ఎఫైర్ ఉంటే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. ఏ స్త్రీ తన భర్త ద్రోహాన్ని సహించదు. అలాగే తన భార్యకు పరాయివాడితో సాన్నిహిత్యం ఉందంటే ఏ మగాడు సహించడు. వారితో కలిసి జీవించడం కష్టమవుతుంది. ఈ కారణంగా, ఇద్దరూ విడిపోతారు, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద చోటుచేసుకుంది. ఆ మహిళా ఉద్యోగి ఆ సహోద్యోగిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖలో నర్రా శిల్పా అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అయితే 2012లో సుధీర్ అనే వ్యక్తిని శిల్ప పెళ్లి చేసుకుంది. వారికి రెండున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే శిల్ప రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ మాసాయిపేటలో ఏఈవోగా పనిచేస్తోంది. అయితే, కోవిడ్ కాలం నుండి, శిల్పా తన సహోద్యోగి మనోజ్కి దగ్గరయ్యారు. అప్పటికే వారి మధ్య శారీరక సంబంధం ఉంది. ఆ సమయంలో… శిల్ప గర్భవతి అయినప్పుడు… గర్భనిరోధక మాత్రలు వేసుకుని కడుపుతీయించుకుంది. ఆ తర్వాత కూడా పలుమార్లు వివాహేతర సంబంధాలు కొనసాగించాడు. అయితే ఈ విషయం ఆమె భర్తకు తెలిసి చాలాసార్లు మందలించాడు. ఇది జరిగిన తర్వాత కూడా శిల్పా, మనోజ్ మధ్య ఉన్న సంబంధం కార్యాలయంలో వెలుగులోకి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఆ సమయంలో కూడా.. వారిద్దరూ శారీరక సంబంధాలు కొనసాగించారని.. అప్పుడు కూడా ఆమె గర్భం దాల్చిందని.. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు అబార్షన్ చేయించుకుంది. మరి ఆ సమయంలో.. భర్తకు విషయం పూర్తిగా అర్థమైన వెంటనే.. విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో.. అప్పటి నుంచి విడివిడిగా ఉంటున్న శిల్ప.. మనోజ్ కు ఈ విషయాన్ని చెప్పింది. సరే విడాకులు తీసుకోమంటూ మనోజ్ కూడా శిల్పకు చెప్పాడు.
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడంతో.. మనోజ్ 2 నెలలు సెలవు తీసుకుని కనిపించకుండా పోయాడు. శుక్రవారం మళ్లీ తిరిగొచ్చాడు. ఈ సమయంలో మనోజ్ కనిపించకపోవడంతో శిల్ప తీవ్ర మనస్తాపానికి గురైంది. తిరిగి వచ్చిన మనోజ్ని చూసి ఇన్నాళ్లు ఎక్కడికి పోయావని అడిగింది. చెప్పకుండానే ఇన్ని సంవత్సరాలు ఎందుకు గడిచిపోయాయని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన శిల్ప, అందరూ చూస్తున్నారని గమనించకుండా కత్తితో మనోజ్ను పొడిచింది. దీంతో మనోజ్ మెడ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు మనోజ్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా.. అతడి చేతికి కత్తి ఎలా వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. మనోజ్ కత్తితో వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని శిల్పా చెప్పింది. అయితే… మనోజ్ నిజంగానే కత్తి తెచ్చాడా అనేది తెలియాల్సి ఉంది.
Grama Sachivalayam Locked: అద్దె చెల్లించలేదు.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని..
తాజావార్తలు
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!