Mallu Bhatti Vikramarka: తొందరలోనే కొత్త రేషన్ కార్డులని అందిస్తాం..
- రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు ఇస్తాం..
- రైతులకు రూ. 2 లక్షల లోపు రుణమాఫీ జరుగుతుంది..
- అర్హులందరికి కొత్త రేషన్ కార్డులను అందజేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ప్రజలకు కరెంటు ఇవ్వాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ట్రిప్ అయితే కరెంటు ఇచ్చేవాళ్ళు కాదు.. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధరాత్రి కంప్లైంట్ వస్తే అర్ధరాత్రి కూడా వెళ్లి కరెంటు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం.. క్షేత్రస్థాయిలో కరెంటు సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు.. రాజకీయ లబ్ది కోసం కొంత మంది సిబ్బందిపై దృష్ప ప్రచారం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు పోవటం అనేది లేనేలేదు.. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు తప్ప.. లైన్ మెయింటెనెన్స్ సమయంలో కరెంటు తీసి చెట్లని కొట్టడం జరుగుతుంది అన్నారు. చెట్ల కొమ్మలు కరెంటు వైర్ల మీద పడినప్పుడు మాత్రమే కరెంటు పోతుంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read Also: Market Value : ప్రపంచంలోని బిలియనీర్ల పాలిట ‘బ్లాక్ ఫ్రైడే’.. రూ. 56 లక్షల కోట్ల నష్టం
Also Read
ఇక, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా కరెంటు పోతే కూడా కరెంటు పోతుందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తున్నాం.. కరెంటు వాడకం పెరిగినప్పటికీ కరెంటును తెప్పించి ప్రజలకు ఇస్తున్నాం.. రాబోయే 10 ఏళ్లకు కూడా అవసరమయ్యే కరెంటుని ఉత్పత్తి చేస్తున్నాం.. పొల్యూషన్ లేని విద్యుత్ ఉత్పాదనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోత ఉండదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే, కొత్తగా రేషన్ కార్డులని అందిస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం.. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది.. లక్ష్యానికి అనుగుణంగా అందరికీ రుణమాఫీ చేస్తున్నాం.. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కూడా జరుగుతుంది అని భట్టి విక్రమార్క వెల్లడించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!